Wife Arrest: తిరుపతి జల్లా బుచ్చినాయుడు కండ్రికలో ఓ దారుణ గటన చోటుచేసుకుంది. భర్త గొంతును కోసి భార్య అతి దారుణంగా హత్య చేసింది. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం నీర్పాకోట హరిజనవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. భీమయ్య–రేవతి దంపతుల మధ్య చాలా కాలంగా కుటుంబ, ఆర్థిక కలహాలతో రోజు గొడవ జరిగేది.
ఇటీవల “తల్లికి వందనం” పథకం డబ్బులు వచ్చిన తర్వాత వివాదం మరింత తీవ్రం అయింది. రేవతి, శ్రీకాళహస్తి మండలానికి చెందిన నాగరాజుతో కలిసి భర్తను హత్య చేసిందని అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి నిద్రిస్తున్న భీమయ్య గొంతును షేవింగ్ బ్లేడ్తో కోసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి పరారయ్యాడని భార్య రేవతి నాటకం ఆడినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!
భీమయ్య తల్లిదండ్రులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోలీసులు భర్త రేవతిని విచారించారు. విచారణలో రేవతి నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రేవతి, నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!