E-Paper
Advertisement

Pawan Kalyan : ఢిల్లీలో పొత్తులపై క్లారిటీ వస్తుందా..? జనసేనాని దారెటు..?

Pawan Kalyan : ఢిల్లీలో పొత్తులపై క్లారిటీ వస్తుందా..? జనసేనాని దారెటు..?
Advertisement

Pawan Kalyan : జనసేనాని ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్నారు. సోమవారం హస్తినలో కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, మురళీధరన్ తో సమావేశమైయ్యారు. మంగళవారం కూడా మరోసారి బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మురళీధరన్ తో భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది. మురళీధరన్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది.

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై మురళీధరన్, పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం, భవిష్యత్‌ కార్యాచరణపై ఇరువురు నేతలు సమాలోచనలు చేసినట్లు సమాచారం. జనసేనానితోపాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు.

Advertisement

జనసేనానికి ఏపీ బీజేపీ నేతలకు మధ్య గ్యాప్ ఉంది. కొంత మంది కాషాయ నేతలు జనసేనతోనే కలిసి పోటీ చేస్తామంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ లాంటి నేతలు జనసేన.. బీజేపీకి సహకరించడం లేదని బహిరంగంగానే విమర్శించారు. ఈ రెండు పార్టీ కలిసి కార్యక్రమాలు చేపట్టన సందర్భాలు లేవు. పేరుకు మిత్రులుగా ఉన్నారు గానీ ఉమ్మడిగా ముందుకు వెళ్లడంలేదు.

టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని పవన్ ఆలోచిస్తున్నారని ఇటీవల చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఒంటరిగా పోటీకి దిగితే వీరమరణం తప్పదని ఇప్పటికే పవన్ స్పష్టం చేశారు. తమ గౌరవానికి తగ్గకుండా సీట్లు ఇస్తే కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని తేల్చిచెప్పేశారు. ఏడాది వ్యవధిలోనే చంద్రబాబుతో పవన్ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారు. పొత్తులపై పూర్తి కార్లిటీ ఇవ్వకపోయినా… కలిసే వెళతామనే సంకేతాలు బలంగా పంపించారు.

Advertisement

బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేది లేదంటోంది. దీంతో చంద్రబాబుకు బీజేపీకి మధ్యలో జనసేనాని ఉన్నారు. మరి మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిర్చే బాధ్యత పవన్ తీసుకుంటారా..? ఆ దిశగా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పిస్తారా..? ఢిల్లీ పర్యటనతో పొత్తులపై క్లారిటీ వస్తుందా..? జనసేనాని దారెటు..?

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×