Principal Murder: గురువుగా గౌరవించాల్సిన విద్యార్థులే ప్రిన్సిపాల్ను టార్గెట్ చేశారు. అదీ డబ్బుల కోసం ఇంత దారుణానికి పాల్పడటం ఇప్పుడు సొసైటీని షాక్ కు గురి చేసింది. నల్గొండ జిల్లా జేబీ కాలనీలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఇదంతా చూస్తే ఇది క్షణికావేశం కాదు.. పక్కా ప్లానింగే. మరి విద్యార్థుల్లో ఈ క్రిమినల్ మైండ్సెట్ ఎలా పెరుగుతోంది? డబ్బు, జల్సాల కోసం ప్రాణం తీయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తోంది? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సా? కుటుంబ పర్యవేక్షణ లోపమా? స్కూల్లో కౌన్సెలింగ్ వ్యవస్థ బలహీనంగా ఉందా? పిల్లల ప్రవర్తనలో ప్రమాదకర మార్పులను ముందుగానే గుర్తించడంలో మన వ్యవస్థ విఫలమవుతోందా? ఇవన్నీ ప్రశ్నలే. ఈ ఘటన ఒక హత్య కేసు మాత్రమే కాదు.. విద్యార్థుల మానసిక స్థితిపై సమాజానికి ఇచ్చిన సీరియస్ వార్నింగ్.
Also Read: చదివింది 4వ తరగతి మాత్రమే.. నేడు రూ.వేల కోట్ల బిజినెస్కు అధిపతి