BigTV English
Advertisement

Jagan : నేటితో వైసీపీ సర్కార్ పాలనకు నాలుగేళ్లు.. 98.5 శాతం హామీలు అమలు చేశారా..?

Jagan : నేటితో వైసీపీ సర్కార్  పాలనకు నాలుగేళ్లు.. 98.5 శాతం హామీలు అమలు చేశారా..?

CM Jagan news today(Andhra news updates) : ఏపీలో వైసీపీ సర్కార్ పాలనకు నాలు­గేళ్లు పూర్తైంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని సీఎం జగన్ పదేపదే చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చామంటున్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధంలేకుండా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అంటున్నారు. చెప్పిన మాట ప్రకారం సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కొన­సాగి­స్తున్నామని స్పష్టం చేస్తున్నారు.


ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించాలన్న లక్ష్యంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు చేపట్టారు. ఎన్ని­కలకు ఏడాది ముందే ప్రతి ఇంటికి వెళుతున్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారులను కలుస్తున్నారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగిందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు.

మరో పక్క వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పరిపాలనలో సంస్కరణల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. గ్రామ, వార్డుస్థాయికి పరిపాలనను, పథకాలను, పౌర సేవలను పారదర్శకంగా తీసుకెళ్లామని అంటోంది. గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని చెబుతోంది.


గత నాలుగేళ్లలో అన్ని వర్గాలకు నవరత్నాల కింద డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం చేశామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇందులో డీబీటీ ద్వారా రూ.2.11 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశామని ప్రకటించింది. నాన్‌ డీబీటీ ద్వారా రూ.91 వేల కోట్లు వ్యయం చేశామని వెల్లడించింది. సీఎం జగన్ చెబుతున్నట్లు 98.5 శాతం హామీలు అమలయ్యాయా..?

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×