BigTV English
Advertisement

YS Sharmila: కూటమి ప్రభుత్వానికి షర్మిల ప్రశ్న.. బాబుగారి ఇది మీకు న్యాయమూ?

YS Sharmila: కూటమి ప్రభుత్వానికి షర్మిల ప్రశ్న.. బాబుగారి ఇది మీకు న్యాయమూ?

YS Sharmila: ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై కాంగ్రెస్ పార్టీ అలర్టయ్యింది. కూటమి నేతలు చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదంటున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. విద్యుత్ చార్జీలు పెంచేది లేదంటూనే జనాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ట్రూ అప్ ఛార్జీలపై వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇప్పటికే రూ.17 వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. ఇది చాలదన్నట్లుగా రూ.12 వేల కోట్ల అధిక భారం మోపాలని చూడటం దుర్మార్గమని ప్రస్తావించారు. ఏనాడో వాడిన కరెంటుకు ఇప్పుడు అదనపు ఛార్జీలు వేయడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. ట్రూ అప్ పేరుతో ఎన్నాళ్లు ఈ దోపిడి? అంటూ విరుచుకు పడ్డారు.

విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు చంద్రబాబు చేసింది ముమ్మాటికీ నమ్మక ద్రోహమేనని అన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసిందని, చివరకు ప్రజా కోర్టులో పడిందన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు.


రూ. 12 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని ప్రజలపై పడకుండా చూడాలన్నారు. ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని ప్రస్తావించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు వెంటనే APERCకి లేఖ రాయాలన్నారు. గతంలో విధించిన రూ.17 వేల కోట్ల భారాన్ని సైతం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ALSO READ: ఉదయం వివాహం.. రాత్రికి వధువు సూసైడ్, తెర వెనుక కథేంటి?

విద్యుత్ ఛార్జీలు పెంపుపై ఏపీలో కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండదని కొద్దిరోజుల కిందట చెప్పారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.

వైసీపీ హయాంలో చేసిన తప్పులను సరి చేసేందుకే సమయం సరిపోతుందన్నారు. గతంలో వైసీపీ హయాంలో యాక్సిస్ ఎనర్జీతో యూనిట్‌కు రూ.5.12లకు ఒప్పందం చేసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఒప్పందాన్ని సవరించి యూనిట్ రూ.4.60లకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు తక్కువ ధరకే విద్యుత్‌ను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎక్స్ వేదికగా ప్రస్తావించడంపై ఛార్జీలు పెరుగుతున్నాయన్న ఆందోళన సామాన్యుడిలో మొదలైంది.

Related News

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Minister Lokesh: అప్పుడప్పుడూ ఏపీకి.. జగన్ ది వేరే భ్రమాలోకం.. మంత్రి లోకేశ్ ఫైర్

Syamala Ysrcp: నేను చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మీడియాపై చిందులు తొక్కిన శ్యామల

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

Big Stories

×