E-Paper
Advertisement

YS Sharmila Tour : ఏపీలో అధికారమే లక్ష్యంగా వైఎస్ షర్మిల దూకుడు.. నేటి నుంచి జిల్లాల్లో పర్యటన

YS Sharmila Tour : ఏపీలో అధికారమే లక్ష్యంగా వైఎస్ షర్మిల దూకుడు.. నేటి నుంచి జిల్లాల్లో పర్యటన
Political news in ap

YS Sharmila Today news(Political news in AP):

ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల దూకుడు పెంచారు. ఎన్నికల సమీపిస్తుండటంతో వైసీపీని దెబ్బకొట్టి.. అన్న జగన్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు పీసీసీ పగ్గాలు చేపట్టిన మూడు రోజులకే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. జగన్‌ కంటే ముందే ప్రజలతో మమేకమయ్యేందుకు ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకూ ప్రజాక్షేత్రం పర్యటించనున్నారు షర్మిల. ఈ నేపథ్యంలోనే నేడు ఇచ్చాపురం నుంచి తన జిల్లాల పర్యటనను ప్రారంభిస్తారు.

ఏపీలో అధికారమే లక్ష్యంగా షర్మిల వ్యూహాలు రచిస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగానే జగన్‌ బలగాన్ని తన వైపు తిప్పుకునే ఎత్తుగడలో ఉన్నారు. ఇందుకు వైఎస్ఆర్‌తో అనుబంధం గల నేతలతో కేవీపీ చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇదే వ్యూహంతో షర్మిల జిల్లాల టూర్‌ కూడా కొనసాగనుంది. పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన ఆమె.. క్షేత్రస్థాయి పర్యటనలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించి అక్కడ కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉంది, మళ్లీ పుంజుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై క్యాడర్‌తో చర్చలు జరపనున్నారు షర్మిల.

ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి యాత్ర చేపట్టిన షర్మిల ఆ తర్వాత ఆ తర్వాత పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు. రేపు విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించి స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతారు. ఆ తర్వాత ఎల్లుండి కాకినాడ, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, 26వ తేదీన తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28వ తేదీన బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, 29వ తేదీన తిరుపతి, చిత్తూర్, అన్నమయ్య జిల్లా, 30వ తేదీన శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు, 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×