E-Paper
Advertisement

YS Vijayamma: విజయమ్మ రాసిన ఆ లేఖ ఫేక్? మళ్లీ దొరికిపోయిన వైసీపీ?

YS Vijayamma: విజయమ్మ రాసిన ఆ లేఖ ఫేక్? మళ్లీ దొరికిపోయిన వైసీపీ?

YS Vijayamma: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే తెలిసే ఉంటుందిగా.. కానీ కొన్ని సార్లు ఎరుకై చేసిన తప్పిదంలో ఇరుక్కొని ఎంత తప్పించుకోవాలన్నా.. అది కుదరనే కుదరదు. సేమ్ టు సేమ్ అలాంటిదే ఇది అంటూ వైసీపీని ఉద్దేశించి టీడీపీ విమర్శిస్తోంది. ఏకంగా మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మ పేరిట ఫేక్ లెటర్ సృష్టించిన ఘనత వైసీపీకే దక్కుతుందని, వారెవ్వా అంటూ టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా సోమవారం సాయంత్రం వైయస్ విజయమ్మ పేరిట ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తనను తీవ్రంగా కలచి వేస్తోందని, లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం చూస్తుంటే తీవ్ర మానసిక ఆవేదన కలుగుతున్నట్లు విజయమ్మ చెప్పినట్లుగా లేఖ ద్వారా వివరించారు.

అలాగే గతంలో జరిగిన తన కారు ప్రమాదంకు సంబంధించి, మాజీ సీఎం జగన్ పై దుష్ప్రచారం చేయడం అత్యంత జుగుప్సాకరంగా ఉందని, అమెరికాలో ఉన్న తన మనవడి దగ్గరకు వెళితే తప్పుగా చిత్రీకరించి, భయపడి విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని లేఖలో ప్రచురితమైంది. ఇకపై ఇటువంటి అసత్యాలను ప్రచారం చేస్తే తాను ఊరుకునే ప్రసక్తే లేదంటూ విజయమ్మ చెప్పినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖను విడుదల చేసింది.

Also Read: Aghori In Kushna Palli: అఘోరీ నాగ సాధువు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వందల సంఖ్యలో అఘోరాలు రానున్నారా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా లేఖను విడుదల చేసిన కొద్ది క్షణాలకే, టీడీపీ సైతం అదిరిపోయే ట్విస్ట్ వైసీపీకి ఇచ్చిందని చెప్పవచ్చు. గతంలో షర్మిళకు మద్దతుగా వైయస్ విజయమ్మ విడుదల చేసిన లేఖలోని సంతకం, సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లేఖలోని సంతకం ఒకటే కాదని, విజయమ్మ పేరుతో ఫేక్ లెటర్ సృష్టించారంటూ టీడీపీ రివర్స్ ఎటాక్ ప్రారంభించింది.

రెండు సంతకాలు ఒకేలా లేవంటూ.. స్వయంగా జగన్ తల్లి పేరుతో ఫేక్ లెటర్ సృష్టించి విడుదల చేయడం వైసీపీకి చెల్లిందని టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి ఈ ప్రచారంపై మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం స్పందించకపోవడం విశేషం. ఇంతకు వైసీపీ విడుదల చేసిన లెటర్ ఫేక్ అవునో, కాదో కానీ టీడీపీ ఇచ్చిన షాక్ మామూలుగా లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీ స్పందించి ఈ లేఖపై క్లారిటీ ఇస్తేనే అసలు విషయం తేలనుందని చెప్పవచ్చు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×