E-Paper
Advertisement

Ambati Tea campaign: అంబటి మాస్టర్ ప్లాన్, ఆపై ఆదేశాలు..?

Ambati Tea campaign: అంబటి మాస్టర్ ప్లాన్, ఆపై ఆదేశాలు..?
Advertisement

Ambati Tea campaign: అసలే ఎండాకాలం.. వైసీపీ నేతలు ఉక్కుపోతకు గురవుతున్నారు. ఫ్యాన్ గాలి ఓటర్లకు రీచ్ కాకపోవడంతో నానాఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా తమ బుర్రకు పదును పెడుతున్నారు నేతలు. దీనికితోడు ఎన్నికల సంఘం అన్నివైపుల నుంచి ఆంక్షలు పెట్టడంతో కొత్త కొత్త ఆలోచనలకు తెరతీస్తున్నారు. ఈ జాబితాలో మంత్రి అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు.

మంత్రి అంబటి రాంబాబు తన నియోజకవర్గమైన సత్తెనపల్లిలో ఆ మధ్య బుల్లెట్‌పై తిరుగుతూ ప్రజలను పలకరించేవారు. ఆ తర్వాత కేఫ్ దుకాణానికి వెళ్లి కస్టమర్లకు టీ చేసి ఇచ్చారు కూడా. దాదాపు వారం రోజులపాటు ఇలాగే సాగింది. మంత్రి అంబటి మావద్దకే వస్తున్నారని అక్కడి ప్రజలు అనుకున్నారు. కానీ రాంబాబు మాస్టర్ ప్లాన్ వేరేగా ఉందని ఆ తర్వాత అక్కడి ప్రజలకు అర్థమైంది. రోజూ టీ షాపుకు ఎంతమంది కస్టమర్లు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నారు అంబటి.

Ambati Tea campaign
Ambati Tea campaign
Advertisement

ఇంకేముంది.. ఆ తర్వాత టీ షాపులకు వెళ్లడం మానేశారు మంత్రి అంబటి. ఏంటా అని కొందరు వ్యక్తులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. పేపర్ టీ కప్పులపై పార్టీ పేరు, ఆయన ఫోటోలతో వైసీపీకే ఓటు వేసి తమను గెలిపించాలని రాసి ఉంది. 500 నుంచి 1000 కప్పుల వరకు పంపిణీ చేసి ప్రచారం చేపట్టాలని టీ షాపు ఓనర్లను ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. మంత్రి చెబితే కాదంటారా? అలాగే కానిచ్చారు. కప్పులను టీ షాపు యాజమానులు రెడీ చేశారు. పంచిబెట్టడానికి సిద్ధమైన సమయంలో మీడియా కంటపడింది. సోషల్‌మీడియా అంబటి టీకప్పులు ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×