E-Paper
Advertisement

Anchor Shyamala: ‘జానీ’లు ఎక్కువయ్యారు.. ఎన్టీఆర్, చిరు, బాలయ్య, పవన్‌లను లాగిన శ్యామల

Anchor Shyamala: ‘జానీ’లు ఎక్కువయ్యారు.. ఎన్టీఆర్, చిరు, బాలయ్య, పవన్‌లను లాగిన శ్యామల
Advertisement

YSRCP leader Anchor shyamala shocking comments: ఏపీలో కూటమి పాలనపై వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ‘జానీ’లు ఎక్కువయ్యారని ఆరోపించారు. మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఓ మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో ఇలా జరగడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యకర్తలు తనను వేధిస్తున్నారని వైసీపీ నేత, యాంకర్ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాలో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ నన్ను వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించినప్పటి నుంచి ఇవి మొదలయ్యాయన్నారు. అసభ్య సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారన్నారు. అమెరికాలో ఉండే టీడీపీ కార్యకర్తలు కూడా నన్ను దూషిస్తున్నారన్నారు.

Advertisement

అలాగే, పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారని, బాలికపై లైంగిక దాడి జరిగిందన్నారు. పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు సరిగా స్పందించ‌లేదని, ముందే స్పందించి ఉంటే ఆ పాప బతికేదన్నారు. గుడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారని ఆడపిల్లలు వాపోతే పట్టించుకోలేదని, పైగా సెలవులు ఇచ్చి అందరినీ పంపేశారన్నారు.

జగన్ పాలనలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితే లేదన్నారు. నన్ను అధికార ప్రతినిధిగా ఎంపిక చేసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయన్నారు. దారుణంగా నా గురించి పోస్టులు పెట్టారని, టీడీపీ అఫీషియల్ గ్రూపులో పోస్టులు పెట్టారన్నారు.

Advertisement

సినీ పరిశ్రమ నుంచి వస్తే అంత అలుసుగా ఎందుకు చూస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుంచి రాలేదా? అన్నారు. టీడీపీలో జయప్రద లాంటి మహిళలు పనిచేయలేదా? వైసీపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, అసలైన మహిళా శక్తి ఏంటో త్వరలోనే చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

రాజకీయాల్లో మహిళ అనగానే ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తారా?. నాకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎన్నో దారుణాలు జరిగాయన్నారు. దసరా పండుగ మహిళా శక్తికి నిదర్శనమని, కానీ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×