E-Paper
Advertisement

AP News : గుడిలో రెడ్డి.. అసెంబ్లీ రౌడీ సినిమా స్టైల్‌లో దోపిడీ

AP News : గుడిలో రెడ్డి.. అసెంబ్లీ రౌడీ సినిమా స్టైల్‌లో దోపిడీ

AP News : ఆలయం అంటే పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి. గుడి లోపలే కాదు.. గుడి బయట కూడా దేవుడే కనిపించాలి. కానీ, ఈ మధ్య కాలంలో టెంపుల్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయి. ఫ్లెక్సీలు గట్రా పద్దతీ పాడు లేకుండా పోయాయి. అది వేరే మేటర్. ఇప్పుడు చెప్పబోయేది చాలా డిఫరెంట్. అది ఏపీలో చాలా ఫేమస్ టెంపుల్. ప్రతీరోజూ వేలల్లో భక్తులు వస్తుంటారు. అంతటి పాపులర్ గుడి ప్రాంతాన్ని ఓ పొలిటికల్ లీడర్ కబ్జా చేసేశాడు. కబ్జా అంటే భూకబ్జా కాదు. బిజినెస్ కబ్జా. అక్కడ ఏ దందా అయినా అతని కనుసన్నల్లో జరగాల్సిందే. పార్కింగ్ నుంచి దేవుడి బొమ్మలు అమ్మే షాప్ వరకూ.. అంతా అతని కంట్రోల్‌లోనే. అందుకే, అక్కడ ఎటూ చూసినా అతని ఫోటోలే. ఏడాదికి సుమారు 5 కోట్లకు పైగా దోపిడీ దందా చేస్తున్నాడట ఆ వైసీపీ లీడర్. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా దందా?

తిరుచానూరులో అసెంబ్లీ రౌడీ తరహా సీన్

అసెంబ్లీ రౌడీ సినిమా గుర్తుందా? ఓ టౌన్‌లో ప్రతి షాప్ పేరు బాషా అని ఉంటుంది. బాషా పాన్‌షాప్, బాషా కిరాణం షాప్, బాషా చికెన్ సెంటర్.. ఇలా. ఆ సీన్‌కు ఏమాత్రం తీసిపోని.. రియల్ సీన్ ఏపీలో జరుగుతోంది. తిరుమల తర్వాత శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా దర్శనానికి వెళ్లే తిరుచానూరులో ఈ దారుణం చూడొచ్చు. షాప్ పేరు కాదు కానీ.. దాదాపు ప్రతి షాప్ బోర్టుపై ఓ వైసీపీ నాయకుడి ఫోటో ఉంటుంది. అతనే రామచంద్రారెడ్డి. లోకల్ సర్పంచ్.

చేతిలో పవర్.. చేతినిండా పైసా వసూల్

వరుసగా సర్పంచ్ గిరీ వెలగబెడుతున్న రామచంద్రారెడ్డి అనే నాయకుడు నియంతలా తయారయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత పదేళ్లలో ఇక్కడ దుకాణాలు, దందాలన్నీ ఆయనవే. కన్ను పడిన భూములన్నీ ఆయనవే అని ఆరోపణలున్నాయి. సుదీర్ఘకాలం పనిచేసిన ఆలయ ఈవో కూడా చెయ్యి కలిపి అడ్డగోలుగా దందాలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆడిటింగ్ కూడా నామమాత్రమే జరుగుతుందని చెప్తున్నారు. రాష్టంలో అధికారం ఎవ్వరిదైనా.. తిరుచానూరులో పెత్తనం మాత్రం వీళ్లదే అంటున్నారు.

Also Read : విమానం నడిపిన కేతిరెడ్డి.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..

కోట్లలో దందాలు.. అడ్డుకునే వారెవరు?

అమ్మవారి ఆలయానికి, పోలీస్ స్టేషన్‌కు తప్ప.. అన్ని దుకాణాలకు కచ్చితంగా అయ్యగారి ఫోటో పెట్టుకోవాలనే హుకుం జారీ చేశారట. ఇష్టమున్నా, లేకపోయినా దుకాణాలకు రామచంద్రారెడ్డి ఫోటో కనిపిస్తుంది. చివరకు ఆర్టీసి బస్టాప్‌ను కూడా అనధికారికంగా అద్దెకు ఇచ్చారని చెప్తున్నారు. ఎవరైనా ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా.. ఈయన అనుమతి ఉండాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా వాహనాల పార్కింగ్ టెండర్ పేరుతో అడ్డగోలుగా దందాలు నిర్వహించారు. ఒక్క వాహనాల పార్కింగ్ టెండర్ ద్వారానే ఏకంగా 3, 4 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి ప్రతిరోజు 30, 40 వేల మంది భక్తులు వస్తుంటారు. రాష్ట్రంలో అత్యంత అధిక ఆదాయం ఉన్న పంచాయతీ కూడా తిరుచానూరుగా చెప్తారు. ఆ ఆదాయానికి సర్పంచ్ రామచంద్రారెడ్డి వల్ల భారీ నష్టం వస్తోందని స్థానికుల ఆరోపణ. ఆలయం చుట్టూ దందాలతో తన వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవడంలోనే సర్పంచ్ బిజీగా ఉంటారని.. మిగతా విషయాలేవీ పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుచానూరు సర్పంచ్‌ రామచంద్రారెడ్డిపై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

tiruchanur sarpanch

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×