MLA Vunnamatla Eliza (ap breaking news today): ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు పార్టీ కండువా కప్పి ఎలీజాను పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి అభ్యర్థిగా కంభం విజయరాజును వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించడంతో.. ఎలీజా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ గూటికి చేరారు.
ప్రస్తుతం చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజాకు వైసీపీ అధిష్ఠానం సీటును నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై.. హైదరాబాద్లో లోటస్పాండ్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల సమీపిస్తుండడంతో వైసీపీకి ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పవచ్చు. సీటు రాని అభ్యర్థులంతా వైసీపీని వీడి పలు పార్టీల్లో చేరుతున్నారు.