E-Paper
Advertisement

E20 పెట్రోల్ తో పాత వాహనాలకు డేంజరా? అసలు నిజం ఏంటి?

E20 పెట్రోల్ తో పాత వాహనాలకు డేంజరా? అసలు నిజం ఏంటి?
Advertisement

E20 Fuel Impact on Old Vehicles: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా E-20 ఫ్యూయెల్ గురించి బాగా చర్చ జరుగుతోంది. ఈ పెట్రోల్ కారణంగా 2023కు ముందు తయారైన బైక్‌లు, కార్లకు ప్రమాదం జరుగుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌లో త్వరలో E-20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అందుబాటులోకి వస్తుందని, పాత వాహనాలకు ఈ ఫ్యూయెల్ ప్రమాకరంగా మారబోతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ వార్తల్లో వాస్తవం ఎంత? నిజంగానే E-20 పెట్రోల్ పాత వాహనాలకు డ్యామేజ్ చేస్తుందా? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంతకీ E-20 పెట్రోల్ అంటే ఏంటి?

ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్ లో ఇథనాల్ 10 శాతం ఉంటుంది. కానీ, కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను మిక్స్ చేయబోతున్నారు. అదే సమయంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారాన్ని తగ్గించడానికి ఈ ఇథనాల్ మిశ్రమాన్ని పెంచబోతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో E-10 అమల్లో ఉండగా, ఇప్పుడు దాన్ని E-20గా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పాత వాహనాలకు ప్రమాదమా?

Advertisement

E-20 పెట్రోల్ పాత వాహనాలకు ప్రమాదకరమా? అంటే.. కాదనే చెప్పుకోవచ్చు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2023కు ముందు తయారైన వాహనాల్లో ఫ్యూయల్ పైపులు, రబ్బర్ భాగాలు, ప్లాస్టిక్ కంపోనెంట్లు E-20కు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇథనాల్‌ కు కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. అది తేమను ఎక్కువగా తీసుకుంటుంది. అలాగే కొన్ని రబ్బర్, ప్లాస్టిక్ భాగాలను నెమ్మదిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

నిపుణులు ఏం చెప్తున్నారంటే?

ఈ నేపథ్యంలో ఆటో నిపుణులు కొన్ని కీలక సూచలను చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల యజమానులు, ఫ్యూయల్ పైపులు, సీల్స్ లాంటి భాగాలను E-20కి అనుకూలంగా మార్చించుకోవడం మంచిది. అలాగే, ఫ్యూయల్ ఫిల్టర్‌ ను టైమ్ టు టైమ్ మార్చడం మంచిది. ఇథనాల్ వల్ల ట్యాంక్‌ లోని మలినాలు కదిలే అవకాశం ఉండటంతో, ఫిల్టర్ క్లాగ్ కావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ట్యాంక్‌ లో కంప్లీట్ ఖాళీ అయ్యేంత వరకు ఉంచకూడదు. ట్యాంక్ ఖాళీగా ఉంటే, తేమ ఎక్కువగా చేరి ఇంధన నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం హాఫ్ ట్యాంక్ వరకు ఫ్యూయెల్ ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ అసలు నిజం!

Advertisement

E-20 పెట్రోల్ తో ఏప్రిల్ 1 నుంచి పాత వాహనాలు పనికిరావు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ప్రభుత్వం ఒక్కసారిగా మార్పులు చేయదు. దశలవారీగా అమలు చేస్తుంది. అలాగే చాలా వాహనాలు చిన్న మార్పులతోనే E-20ని హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా E-20 పెట్రోల్ పాత వాహనాలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ సరైన మెయింటెనెన్స్, చిన్న మార్పులతో ఈ సమస్యను సులభంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. సో, పాత వాహనదారులు భయపడాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.

Read Also:  కూలెంట్ తగ్గి ఏసీ పని చేయట్లేదా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×