E-Paper
Advertisement

E20 పెట్రోల్ తో పాత వాహనాలకు డేంజరా? అసలు నిజం ఏంటి?

E20 పెట్రోల్ తో పాత వాహనాలకు డేంజరా? అసలు నిజం ఏంటి?

E20 Fuel Impact on Old Vehicles: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా E-20 ఫ్యూయెల్ గురించి బాగా చర్చ జరుగుతోంది. ఈ పెట్రోల్ కారణంగా 2023కు ముందు తయారైన బైక్‌లు, కార్లకు ప్రమాదం జరుగుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌లో త్వరలో E-20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అందుబాటులోకి వస్తుందని, పాత వాహనాలకు ఈ ఫ్యూయెల్ ప్రమాకరంగా మారబోతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ వార్తల్లో వాస్తవం ఎంత? నిజంగానే E-20 పెట్రోల్ పాత వాహనాలకు డ్యామేజ్ చేస్తుందా? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంతకీ E-20 పెట్రోల్ అంటే ఏంటి?

ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్ లో ఇథనాల్ 10 శాతం ఉంటుంది. కానీ, కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను మిక్స్ చేయబోతున్నారు. అదే సమయంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారాన్ని తగ్గించడానికి ఈ ఇథనాల్ మిశ్రమాన్ని పెంచబోతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో E-10 అమల్లో ఉండగా, ఇప్పుడు దాన్ని E-20గా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పాత వాహనాలకు ప్రమాదమా?

E-20 పెట్రోల్ పాత వాహనాలకు ప్రమాదకరమా? అంటే.. కాదనే చెప్పుకోవచ్చు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2023కు ముందు తయారైన వాహనాల్లో ఫ్యూయల్ పైపులు, రబ్బర్ భాగాలు, ప్లాస్టిక్ కంపోనెంట్లు E-20కు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇథనాల్‌ కు కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. అది తేమను ఎక్కువగా తీసుకుంటుంది. అలాగే కొన్ని రబ్బర్, ప్లాస్టిక్ భాగాలను నెమ్మదిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

నిపుణులు ఏం చెప్తున్నారంటే?

ఈ నేపథ్యంలో ఆటో నిపుణులు కొన్ని కీలక సూచలను చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల యజమానులు, ఫ్యూయల్ పైపులు, సీల్స్ లాంటి భాగాలను E-20కి అనుకూలంగా మార్చించుకోవడం మంచిది. అలాగే, ఫ్యూయల్ ఫిల్టర్‌ ను టైమ్ టు టైమ్ మార్చడం మంచిది. ఇథనాల్ వల్ల ట్యాంక్‌ లోని మలినాలు కదిలే అవకాశం ఉండటంతో, ఫిల్టర్ క్లాగ్ కావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ట్యాంక్‌ లో కంప్లీట్ ఖాళీ అయ్యేంత వరకు ఉంచకూడదు. ట్యాంక్ ఖాళీగా ఉంటే, తేమ ఎక్కువగా చేరి ఇంధన నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం హాఫ్ ట్యాంక్ వరకు ఫ్యూయెల్ ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ అసలు నిజం!

E-20 పెట్రోల్ తో ఏప్రిల్ 1 నుంచి పాత వాహనాలు పనికిరావు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ప్రభుత్వం ఒక్కసారిగా మార్పులు చేయదు. దశలవారీగా అమలు చేస్తుంది. అలాగే చాలా వాహనాలు చిన్న మార్పులతోనే E-20ని హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా E-20 పెట్రోల్ పాత వాహనాలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ సరైన మెయింటెనెన్స్, చిన్న మార్పులతో ఈ సమస్యను సులభంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. సో, పాత వాహనదారులు భయపడాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.

Read Also:  కూలెంట్ తగ్గి ఏసీ పని చేయట్లేదా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×