E-Paper
Advertisement

26/11 Terrorist Attack : 26/11 ఉగ్రదాడికి 14 ఏళ్లు.. రాజీ పడేదే లేదన్న విదేశాంగ మంత్రి జైశంకర్..

26/11 Terrorist Attack : 26/11 ఉగ్రదాడికి 14 ఏళ్లు.. రాజీ పడేదే లేదన్న విదేశాంగ మంత్రి జైశంకర్..

26/11 Terrorist Attack : ముంబయి తాజ్ హోటల్ 26/11 ఉగ్రదాడికి నేటితో 14 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు అక్రమంగా భారత్‌లో చొరబడి మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది సామాన్యులు, పోలీసులు, ఎన్ఎస్‌జీ కమాండోస్ ప్రాణాలు కోల్పోయారు.

నాలుగు రోజులు జరిగిన ఈ మారణకాండలో 140 మందికి పైగా భారతీయులు, 26 మంది విదేశీయులు మృతిచెందారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. 1 నిమిషం, 36 సెకండ్ల ఈ వీడియోలో ఉగ్రవాదంపై భారత్ నిరంతర పోరు గురించి వివరించారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఎప్పటికీ వెనక్కు తగ్గదని, రాజీ పడదని అన్నారు.

ఒక్క ప్రాణం పోయినా సహించమని అన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేవరకు విశ్రమించమని తేల్చి చెప్పారు జయశంకర్. అయితే 26/11 దాడుల సూత్రధారుల వివరాలను భారత్ ఐక్యరాజ్యసమితికి అందించింది. వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చమని అభ్యర్ధించింది. పాకిస్థాన్, చైనా కలిసి ఈ ప్రతిపాదనను హోల్డ్‌లో పెట్టాయి. భారత్ అందించిన సూత్రధారులు పాకిస్థాన్‌కు చెందిన హఫీజ్ సయీద్, లష్కర్ ఎ తొయిబా నేత సాజిద్ మీర్, సీనియర్ జెయిషే మహ్మద్ నాయకుడు అబ్దుల్ రఫూఫ్, అబ్దుల్ రెహ్మాన్ మక్కి.

Tags

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×