E-Paper
Advertisement

Chittoor: వీళ్లా మన నాయకులు? చిత్తూరు వైసీపీలో అసలేం జరుగుతోంది?

Chittoor: వీళ్లా మన నాయకులు? చిత్తూరు వైసీపీలో అసలేం జరుగుతోంది?

Chittoor: చిత్తూరులో వైసీపీ నేతల ఆధిపత్య పోరు రోడ్డెక్కింది.. చిత్తూరు వైసీపీ ఇన్చార్జ్ విజయానందరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి అనుచరుడు బుల్లెట్ సురేష్ వర్గాలు మద్య అంతర్గత పోరు వీధుల్లోకి ఎక్కి పార్టీ అందరిలో నవ్వులపాలవుతోంది.. గత ఎన్నికల్లో చిత్తూరు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన విజయానందరెడ్డి థియోసాఫికల్ సోసైటీ భూములను కబ్జా చేశారని బుల్లెట్ సురేష్ అరోపిస్తే, బుల్లెట్ సురేష్ ఓ అమ్మాయిపై అత్యాచారాయత్నం చేశాడంటూ విజయానంద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయించారు.. దీంతో దొందు దొందు అంటూ చిత్తూరు వాసులు .. వీళ్లా ప్రజా జీవితంలోకి వద్దామనుకుంటున్న నాయకులని చర్చించుకుంటున్నారు. అసలు చిత్తూరు వైసీపీలో ఏం జరుగుతోంది?

వైసీపీలో వర్గాల మధ్య ఘర్షణలు

వైసీపీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతలు, అక్రమాలకు పాల్పడి విచారణలు ఎదుర్కొంటున్న వారు చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. అయితే అంతర్గత విభేదాలు కూడా అక్కడే ఎక్కువుగా ఉంటాయి. జిల్లాలో రోజా వర్సెస్ పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి వర్సెస్ నారాయాణ స్వామి, పెద్దిరెడ్డి వర్సెస్ విజయానందరెడ్డి ఇలా ప్రతినియోజక వర్గంలో పెద్దిరెడ్డి వర్గం, ఆయన యాంటీ వర్గాలు ఆధిపత్యం కోసం రాజకీయం చేస్తూనే ఉంటాయి. చిత్తూరులో కూడా పెద్దిరెడ్డి వర్గానికి బలమైన నాయకులు ఉన్నారు.

చిత్తూరు పెద్దిరెడ్డి వర్గం లో గొడవలు

చిత్తురులోని పెద్దిరెడ్డి వర్గంలో మొదలియార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్ కీలకంగా ఉన్నారు. గత ఎన్నికలలో చిత్తూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా విజయానందారెడ్డి పోటీ చేసారు..ఆయనకి వ్యతిరేకంగా బుల్లెట్ సురేష్ పనిచేసార్నన్న అరోపణలున్నాయి..ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు పరిపాటిగా మారాయి.

బుల్లెట్ సురేష్ అరోపణలు

విజయానందరెడ్డి వర్గం తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆయన థియోసాఫికల్ భూములను కబ్జా చేసి, అక్కడున్న చారిత్రాత్మక భవనాలను పడగొట్టి, ఆ ప్రాంతాన్ని చదను చేసారని బుల్లెట్ సురేష్ మీడియా సమావేశం పెట్టి అరోపించారు.. చిత్తూరు అర్టీసి బస్టాండ్ వద్ద రెండు ఎకరాల భూమి విషయంలో చిత్తూరులో గత వారం రోజులుగా దానిపై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది.

పెద్దిరెడ్డి వర్గం VS విజయానందరెడ్డి వర్గం

ఉన్నట్లుండి కొంతమంది ఈ స్థలంలో ఉన్న భవనాన్ని పడగొట్టి చదను చేశారు. తర్వాత కొంతమంది బయట ప్రాంతాల వారికి తాము భూమిని అమ్మామని, తాము థియోసాఫికల్ వారణాసి సభ్యులమని చెప్పుకున్నారు. అయితే డాక్యుమెంట్స్ చూపించమని నిలదీస్తే.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు..దాంతో ఆ వివాదం అందరి దృష్టిలో పడింది.. ఆ క్రమంలో పెద్దిరెడ్డి వర్గీయుడైన బుల్లెట్ సురేష్ రంగంలోకి దాని వెనుక ఉంది విజయానందరెడ్డని, ఆయనతో పాటు మరో ముగ్గురు నాయకులు ఉన్నారని బహిరంగంగా అరోపించారు.

చిత్తూరు రాజకీయ కలహంలో కొత్త మసాలా

తాజాగా చిత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది మహిళలు చిత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట అందోళన నిర్వహించారు.. అందులో ఓ అమ్మాయి తనపై వైసీపీ నేత బుల్లెట్ సురేష్ అత్యాచార యత్నం చేసాడంటు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దాంతో అక్కడున్న వారితో పాటు పోలీసులు ఆమెను అడ్డుకుని, ఎలాంటి ఉపద్రవం జరగకుండా నిరోధించారు. అయితే ఆ అమ్మాయి గతంలో బుల్లెట్ సురేష్ ఇంట్లొ పనిచేసేదని, అమ్మాయి తమ్ముడు మీద బుల్లెట్ సురేష్ దొంగతనం కేసు కూడా పెట్టాడని సమాచారం.

వైసీపీ శ్రేణుల్లో ఆవేదన

ఈ గొడవల మధ్య అమ్మాయి బయటకు వచ్చి తనపై అత్యాచార యత్నం చేశాడంటూ ఆందోళన చేయడం సంచలనంగా మారింది.. ఈ వ్యవహారం వెనుక విజయానంద రెడ్డి వర్గీయుల హస్తం ఉందని, సురేష్ వర్గం ఆరోపిస్తోంది. మొత్తం వ్యవహారంలో ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ బజారున పడి, తమ పరువు కూడా పార్టీ పరువు కూడా తీస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి,అంటున్నారు. ఏదేమైనా పెద్దిరెడ్డి వర్సెస్ విజయానందరెడ్డి వర్గాల మద్య చిత్తూరు వైసీపీలో జరుగుతున్న ఆధిపత్యపోరు మరోసారి బయటపడిందంటున్నారు.

Also Read: హోర్ముజ్ పగ్గాలు.. అణు హక్కులు.. ఇరాన్ 10-సూత్రాల ప్లాన్‌కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్!

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×