Raja Singh: ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన చట్టాలు, చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కుట్ర కోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు.
రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ పేరుతో షేక్ సాదిక్ అనే వ్యక్తి యువతులను ట్రాప్ చేస్తున్నాడని, అతడి బారిన ఇంకా ఎంతమంది పడ్డారనే విషయంపై సమగ్ర విచారణ జరపాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి ఇంటెలిజెన్స్, ఎస్బీ విభాగాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంస్థలు, ట్రైనింగ్ సెంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
హిందువులు తమ పిల్లలను కాలేజీలు, హాస్టళ్లు లేదా ట్రైనింగ్ సెంటర్లకు పంపించే ముందు ఆయా సంస్థల నిర్వహణ, కార్యకలాపాలు, అక్కడి పరిస్థితులపై పూర్తిగా పరిశీలించుకోవాలని రాజాసింగ్ సూచించారు. యువతులను మోసం చేయడం, వేధించడం లేదా ఇతర మార్గాల్లో ట్రాప్ చేయడం వంటి ఆరోపణలు ఉంటే వాటిపై కఠినంగా దర్యాప్తు చేయాలని అన్నారు.
Also Read: ‘ఇరుముడి’ స్టోరీపై రవితేజ కూతురు రియాక్షన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్!
నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారించి, నిందితుడిపై నేరం రుజువైతే చట్టప్రకారం కఠిన శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుడికి త్వరగా ఉరిశిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: జాయ్ రైడ్లో ఊడిన సేఫ్టీ లాక్.. గాల్లోంచి కిందపడ్డ యువతి.. షాకింగ్ వీడియో!