Parliament Prorogation: ఆగస్టు 13న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా 2 నుంచి 4 రోజుల్లోనే ప్రోరోగేషన్ అవుతుంది. కానీ ఇప్పటికీ అధికారికంగా నోటిఫికేషన్ రాలేదు. అమిత్షా 2/3 మెజార్టీ కోసం స్కెచ్ వేస్తున్నారా అన్న ప్రశ్నల్ని కాంగ్రెస్ వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ను సీట్ల పెంపుతో లింక్ చేసిన బిల్లు ఏప్రిల్లో 2 బై 3 మెజార్టీ లేకుండా ఓడిపోయింది. 2029 ఎన్నికలకు ముందు అమలు చేయాలన్న టార్గెట్తో మళ్లీ ప్రయత్నాలు ఉన్నట్లు ఊహాగానాలైతే ఉన్నాయ్. దక్షిణ రాష్ట్రాలు సీట్ల తగ్గింపు భయంతో వ్యతిరేకిస్తున్నాయ్. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రత్యేక సమావేశాలు పెడుతారా? లేక ఇది కేవలం పొలిటికల్ గేమా? ఏం జరగబోతోంది?