BigTV English

Manipur Violence: నగ్నంగా మహిళల ఊరేగింపు.. సుప్రీంకోర్టు సీరియస్.. మోదీ వార్నింగ్.. పార్లమెంట్లో రచ్చ..

Manipur Violence: నగ్నంగా మహిళల ఊరేగింపు.. సుప్రీంకోర్టు సీరియస్.. మోదీ వార్నింగ్.. పార్లమెంట్లో రచ్చ..
Manipur violence latest updates

Manipur violence latest updates(Today’s breaking news in India): దారుణం జరిగింది. మణిపూర్‌లో పరిస్థితి అదుపు తప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనంతో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అరాచకవాదులు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అంతా ఉలిక్కిపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసింది.


ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆ వీడియో వైరల్ అవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే డిలీజ్ చేయాలని ట్విటర్‌ సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లను ఆదేశించింది.

వీడియోలో దృశ్యాలు దారుణంగా ఉన్నాయి. ఇద్దరు మహిళలు దుస్తులు లేకుండా ఉన్నారు. వారి చుట్టూ చాలామంది మగవారు కనిపిస్తున్నారు. వారంతా కలిసి బాధిత మహిళలపై అత్యాచారం చేశారని ఓ ఆదివాసీ సంస్థ ఆరోపించింది. మే 4న ఈ ఘటన జరగ్గా.. లేటెస్ట్‌గా ఈ వీడియో వైరల్‌ అయ్యింది.


ఘటనపై మణిపూర్ సీఎం బీరేన్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

ఘటనపై రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ మౌనం, చేతకాని తనం వల్లే మణిపుర్‌లో అరాచకాలు జరుగుతున్నాయని.. దీనిపై I-N-D-I-A మౌనంగా ఉండదని.. మణిపుర్‌ ప్రజలకు తాము అండగా ఉంటామని అన్నారు రాహుల్.

మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఈ పరిణామం తనను ఆందోళనకు గురిచేశాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ అన్నారు. ఘటనపై కేంద్రం తగిన రీతిలో స్పందించకుంటే న్యాయస్థానమే చర్యలు చేపడుతుందంటూ.. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది.

మణిపూర్ ఘటనపై నెలల తరబడి మౌనంగా ఉన్న ప్రధాని మోదీ.. ఈ ఘటనపై మాత్రం స్పందించారు. జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమని.. నిందితులను విడిచిపెట్టబోమని భారత ప్రజలకు భరోసా ఇచ్చారు మోదీ.

మరోవైపు, మణిపుర్‌ అంశంతో పార్లమెంట్‌ అట్టుడికింది. ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రాజ్యసభ వాయిదా పడింది.

Related News

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Big Stories

×