E-Paper
Advertisement

USA: విమానాలు బంద్.. అమెరికా ఆగమాగం.. సైబర్ అటాకా?

USA: విమానాలు బంద్.. అమెరికా ఆగమాగం.. సైబర్ అటాకా?
Advertisement

USA: అమెరికా తాము ప్రపంచంలోకే అత్యంత పర్ ఫెక్ట్ దేశమని అనుకుంటుంది. పూర్తిగా టెక్నాలజీ మీదే ఆధారపడుతుంది. ఆ టెక్నాలజీ మొరాయిస్తే.. ఎంత విపత్కర పరిస్థితి వస్తుందో అగ్రరాజ్యానికి తెలిసొచ్చింది. సాంకేతిక లోపం కారణంగా అమెరికా వ్యాప్తంగా విమానాలు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. దాదాపు 2500 సర్వీసులు ఆలస్యమయ్యాయి. పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. విషయం వైట్ హౌజ్ వరకూ చేరింది. ఇంతకీ అసలేం జరిగిందంటే…

ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ (FAA)లో సాంకేతిక లోపంతో అమెరికా వ్యాప్తంగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. విమాన మార్గాల్లో మార్పులు చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేసేందుకు FAA పని చేస్తుంది. ఇప్పుడు అందులోనే సమస్య వచ్చింది. FAA ఎయిర్‌లైన్స్ కు ఇచ్చే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో Technical Glitch తలెత్తిందని ఎఫ్‌ఏఏ ట్విటర్‌లో తెలిపింది.

Advertisement

సాంకేతిక సమస్యను సాల్వ్ చేసేందుకు నిపుణులు పని చేస్తున్నారు. అయితే, ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. హాట్‌లైన్‌ను యాక్టివేట్ చేసినట్లు అమెరికా రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. దేశీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.

అమెరికా వ్యాప్తంగా 2500లకు పైగా విమానాలు ఆలస్యమైనట్టు తెలుస్తోంది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే ఉండిపోయారు. సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులతో మండిపడుతున్నారు.

Advertisement

విషయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు వివరించారు రవాణా శాఖ మంత్రి. సైబర్‌ అటాక్ జరిగిందని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అయితే, కారణాలపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించారు.

అమెరికాలో ప్రతీరోజు సుమారు 21,000కు పైగా విమానాలు నడుస్తుంటాయి. అందులో దాదాపు 2,000 వరకూ అంతర్జాతీయ విమానాలు ఉంటాయి. FAAలో టెక్నికల్ గ్లిట్చ్ తో ఇప్పుడు ఈ వేలాది సర్వీసులపై ప్రభావం పడింది.

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×