E-Paper
Advertisement

Vande Bharat: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి.. అందుకేనా?

Vande Bharat: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి.. అందుకేనా?
Advertisement

Vande Bharat: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. కంచరపాలెంలో వందే భారత్ పై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. ఆ రాళ్ల దాడితో రైలు కిటికీ అద్దాలు పగిలాయి. విశాఖ స్టేషన్‌ నుంచి కోచ్‌ కాంప్లెక్స్‌కు ట్రైన్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వందే భారత్ రైలుపై రాళ్లు విసిరిన దుండగుల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.

ఇటీవల బెంగాల్ లోనూ వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు విసిరిన ఘటన అప్పట్లో రాజకీయంగా దుమారం లేపింది. కేంద్రం-బీజేపీ మీద కోపంతో టీఎంసీ కార్యకర్తలో ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారని కమలనాథులు ఆరోపించారు. అయితే, ఆ దాడి జరిగింది బెంగాల్ లో కాదని.. బీహార్ లో అని ఆ తర్వాత విచారణలో తేలింది.

Advertisement

తాజాగా, విశాఖలో వందే భారత్ రైలుపై అదే విధంగా రాళ్ల దాడి జరగడం ఆకతాయిల పనిగా చూడలేం అంటున్నారు. కేంద్రంపై, మోదీ విధానాలపై ఆగ్రహంగా ఉన్న వర్గమే ఇలా రైలుపై రాళ్లు విసిరి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండగా.. ఇప్పుడిలా వందే భారత్ రైలుపై రాళ్లతో దాడి చేసి కేంద్రానికి నిరసన సెగ తెలియజేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×