E-Paper
Advertisement

Vande Bharat: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి.. అందుకేనా?

Vande Bharat: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి.. అందుకేనా?

Vande Bharat: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. కంచరపాలెంలో వందే భారత్ పై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. ఆ రాళ్ల దాడితో రైలు కిటికీ అద్దాలు పగిలాయి. విశాఖ స్టేషన్‌ నుంచి కోచ్‌ కాంప్లెక్స్‌కు ట్రైన్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వందే భారత్ రైలుపై రాళ్లు విసిరిన దుండగుల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.

ఇటీవల బెంగాల్ లోనూ వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు విసిరిన ఘటన అప్పట్లో రాజకీయంగా దుమారం లేపింది. కేంద్రం-బీజేపీ మీద కోపంతో టీఎంసీ కార్యకర్తలో ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారని కమలనాథులు ఆరోపించారు. అయితే, ఆ దాడి జరిగింది బెంగాల్ లో కాదని.. బీహార్ లో అని ఆ తర్వాత విచారణలో తేలింది.

తాజాగా, విశాఖలో వందే భారత్ రైలుపై అదే విధంగా రాళ్ల దాడి జరగడం ఆకతాయిల పనిగా చూడలేం అంటున్నారు. కేంద్రంపై, మోదీ విధానాలపై ఆగ్రహంగా ఉన్న వర్గమే ఇలా రైలుపై రాళ్లు విసిరి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండగా.. ఇప్పుడిలా వందే భారత్ రైలుపై రాళ్లతో దాడి చేసి కేంద్రానికి నిరసన సెగ తెలియజేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×