Electric Bus: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళుతోంది ఆ బస్సు. ఆ బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. కరీంనగర్ ఔట్స్కట్స్లోని అలుగునూరు దాటిన తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. ఈ బస్సులకు ఇంజిన్ వెనక భాగంలో ఉంటుంది. నిజానికి ఇక్కడ డ్రైవర్ అలర్ట్గా ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందనే చెప్పాలి. విన్నారుగా అతను అంత కూల్గా డీల్ చేయడంతో ప్రమాదం తప్పింది. అతను ఏ మాత్రం హడావుడి చేసినా అరచి గగ్గోలు పెట్టినా ఇప్పుడు సీన్ మరోలా ఉండేది. ఎందుకంటే దెయ్యం కంటే భయం మా చెడ్డది అంటారు. అందుకే ప్రయాణీకులను భయపెట్టకుండా డ్రైవర్ ప్రశాంత్ డీల్ చేయడంతో పెను విషాదం తప్పిందనే చెప్పాలి. లేదంటే తోసుకోవడం తొక్కేయడం లాంటి సీన్లు కనిపించేవి.
నిజానికి ఆ తర్వాత కూడా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు డ్రైవర్, కండక్టర్. ఫైర్ ఎక్స్టింగిషర్స్ను ఉపయోగించారు. కానీ ఒక్కసారి బ్యాటరీలు అంటుకుంటే ఎలా ఉంటుందనే దానికి ఈ ప్రమాదం ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం.. మంటలను అదుపు చేయడం జరిగింది. అయితే ఈ బస్సులో మంటలు ఎలా చెలరేగాయి? ఎందుకు చెలరేగాయి? తప్పెక్కడ జరిగింది? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
Also read: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు పూనకాలే.. ‘ఓజీ2’ చర్చలు షురూ చేసిన సుజిత్!
ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో రోజురోజుకి ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ప్రమాదం ఇప్పుడు తమకు ఓ కనువిప్పు లాంటిదని.. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఏదేమైనా ఈ బస్సులో ప్రయాణీస్తున్న వారు డ్రైవర్ ప్రశాంత్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. సరైన సమయంలో బస్సును ఆపడం వారిని కూల్గా కిందకు దిగేలా చూడటంతో తమకు పునర్జన్మ కల్పించారంటున్నారు ప్రయాణీకులు.
Srorey By: Appa Rao Big Tv
Also read: Hormuz Crisis: ప్రపంచ దేశాలకు పెద్ద షాక్.. చమురు నౌకలు వెళ్ళే మార్గాన్ని మూసివేసిన ఇరాన్ సైన్యం!