Vizag Metro: ఒక పక్క అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే సిద్ధమవుతోంది.. మరోపక్క నగరం వేగంగా విస్తరిస్తోంది.. టూరిజం మోడ్రనైజేషన్ను వెల్కమ్ చేస్తోంది.. మెట్రో వస్తే ఎక్కడికైనా ఈజీగా వెళ్లొచ్చు.. అయితే, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా వైజాగ్ మెట్రోకు ఇప్పటి వరకు లైన్ క్లియర్ కావట్లేదు. దానికి ప్రధానంగా కొన్ని సాంకేతిక, ఆర్థిక, రాజకీయ కారణాలున్నాయి. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి DPR ఇప్పటికే పలుసార్లు మారాయి. ఇక ప్రైవేటు భూములకు ఎంత మేర పరిహారం చెల్లించాలి? కేంద్రం ఎంత? రాష్ట్రం ఎంత భరించాలి? అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదని తెలుస్తోంది.
రాష్ట్రంలో పాలకులు మారినప్పుడల్లా మెట్రో రూట్ మ్యాప్లు, వ్యూహాలు మారుతూ వస్తున్నాయి. మొదట లైట్ మెట్రో.. ఆ తర్వాత సాధారణ మెట్రో.. ఇప్పుడేమో నియో లేదా పూర్తి స్థాయి మెట్రో అంటున్నారు. దీంతో నివేదికలపై రీవర్క్ చేయాల్సి వస్తోంది. మరోరవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాలా? లేదా పీపీపీ పద్ధతిలో చేపట్టాలా? అనే విషయంలోనూ స్పష్టత రాలేదు.
Also read: పెట్రోల్ అవసరం లేదు.. నీటితో నడిచే స్కూటర్ వచ్చేసింది!
ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం రెండు ఫేజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫస్ట్ ఫేజ్లో 46.23 కిలోమీటర్ల పొడవు, 3 క్యారిడార్లు, 42 స్టేషన్లను ప్రతిపాదించింది. 11 వేల 498 కోట్ల బడ్జెట్ అంచనా వేసింది. ఇక సెకండ్ ఫేజ్లో 30.67 కిలోమీటర్ల పొడవుతో 12 స్టేషన్లు, 1 క్యారిడార్తో దాదాపు 8 వేల కోట్ల బడ్జెట్ అంచనా వేసింది. అయితే, కేంద్ర రైల్వే లేదా పట్టణాభివృద్ధి శాఖల నుంచి తుది అనుమతులతో పాటు.. నిధుల సమీకరణ వేగవంతం అయితేనే వైజాగ్ మెట్రో పట్టాలెక్కే అవకాశం ఉంది.
Also read: Prashna Ravan: యూట్యూబర్ రావణ్ ఫోన్లో మావోయిస్ట్ భావజాలం.. రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు!