E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ హౌజ్‌లో దొంగ ఏడుపులు.. విష్ణుప్రియా చీప్, మరోసారి నోరుజారిన సోనియా

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ హౌజ్‌లో దొంగ ఏడుపులు.. విష్ణుప్రియా చీప్, మరోసారి నోరుజారిన సోనియా

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ మధ్య ఏర్పడే కనెక్షన్స్ నిజమని నమ్మడం ప్రేక్షకులకు చాలా కష్టం. ఆ హౌజ్‌లో గొడవలు ఉన్నంత నేచురల్‌గా కనెక్షన్స్ అనిపించవు. అలా తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. హౌజ్ అంతా కలిసికట్టుగా ఇద్దరు మనుషుల గురించి బాధపడడం నమ్మశక్యంగా అనిపించలేదు. పైగా తిండి కోసం హౌజ్‌లో దొంగతనాలు మొదలయ్యాయి. కడుపునిండా తిండి ఉన్నా కూడా వేరే టీమ్స్ సంపాదించుకున్న రేషన్‌పై కన్నేయడం మాత్రమే కాకుండా కక్కుర్తి గేమ్ ఆడడం మొదలుపెట్టారు. అంతే కాకుండా మరోసారి సోనియా మొసలి కన్నీళ్లు కార్చడంతో పాటు విష్ణుప్రియా గురించి నోరుజారింది.

టీమ్ మార్చింది

బిగ్ బాస్ 8లో నైనికా, యష్మీ, నిఖిల్ టీమ్స్ మధ్య రేషన్ కోసం పోటీ మొదలయ్యింది. నైనికా, యష్మీ టీమ్స్‌కు న్యాయం జరిగినా నిఖిల్ టీమ్‌కే రేషన్‌ విషయంలో అన్యాయం జరిగింది. నిఖిల్, నాగ మణికంఠకు కనీసం ఫుడ్ ఇవ్వకుండా వారం రోజుల పాటు రాగి జావా, పచ్చి కూరగాయలు తింటూ బ్రతకమని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో వారికి అన్యాయం జరిగిందని ముందుగా సోనియా ఫీల్ అయ్యి ఏడుపు మొదలుపెట్టింది. తన కన్నీళ్లకు కరిగిపోయిన నిఖిల్, పృథ్వి.. ఒకరి తర్వాత ఒకరు వచ్చి తనను ఓదార్చడం మొదలుపెట్టారు. రేషన్ రానందుకు తామే ఫీల్ అవ్వడం లేదని నిఖిల్ అన్నాడు. ఎప్పుడూ నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండే సోనియా.. పార్టీ మార్చి పృథ్విరాజ్‌తో పులిహోర కలపడం మొదలుపెట్టింది.

Also Read: నిఖిల్‌ను ఎమోషనల్ ఫూల్ చేసిన సోనియా.. మధ్యలో మణికంఠ బలి, వారమంతా అదే తిని బ్రతకాలా?

అందరి ఏడుపు

రేషన్ కోసం రెండో రౌండ్ పోటీ ముగిసిన తర్వాత కూడా నిఖిల్ టీమ్‌కు అన్యాయమే జరిగింది. సంచాలకురాలిగా వ్యవహరించిన యష్మీ.. నైనికా టీమ్ గెలిచినట్టుగా ప్రకటించింది. ఆ తర్వాత తన నిర్ణయానికి తానే ఫీల్ అయ్యి మణికంఠను పట్టుకొని ఏడ్చేసింది. సీత కూడా రేషన్‌ను పంచుకుంటామని ఏడుస్తూ బిగ్ బాస్‌ను ప్రాధేయపడింది. అలా తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అంతా దొంగ ఏడుపులు ఏడ్చారు. అంతా ముగిసిన తర్వాత గెలిచినా కూడా యష్మీ, నైనికా టీమ్స్ పోటాపోటీగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టాయి. చికెన్, టీ పౌడర్, చక్కెర.. ఇలా అన్నింటిని ఒక టీమ్ నుండి మరొక టీమ్ దొంగతనం చేశాయి.

రెచ్చగొడతారు

రేషన్ కోసం జరిగిన టాస్కుల్లో నైనికా టీమ్‌కు కూడా కొన్ని జ్యూస్ బాటిల్స్ దక్కాయి. యష్మీ టీమ్‌ను ఏడిపించడం కోసం ఒక జ్యూస్ బాటిల్ తీసుకొని వారి ముందే తిరుగుతూ తనకు దిష్టి తాకకూడదు అంటూ వ్యంగ్యంగా మట్లాడింది విష్ణుప్రియా. దీంతో యష్మీ, ప్రేరణ కలిసి తన వెంటపడ్డారు. వారిని తప్పించుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ పెట్టుకొని జ్యూస్ తాగడం మొదలుపెట్టింది విష్ణుప్రియా. ఇదంతా గమనిస్తున్న అభయ్, సోనియా.. దీని గురించే మాట్లాడుకున్నారు. ప్రేరణ, విష్ణుప్రియా.. ఇద్దరూ మనుషులను రెచ్చగొట్టడంలో నిపుణులు అని సోనియా చెప్పింది. అయితే ప్రేరణ మాత్రం కొంచెం తెలివైనదని, విష్ణుప్రియా మాత్రం మనుషులను చీప్‌గా రెచ్చగొడుతుందని మరోసారి తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×