BigTV English
Advertisement

Gold Loans: గోల్డ్ లోన్ వినియోగదారులకు అలర్ట్.. ఇవి తెలుసుకోకుంటే మీకే నష్టం..

Gold Loans: గోల్డ్ లోన్ వినియోగదారులకు అలర్ట్.. ఇవి తెలుసుకోకుంటే మీకే నష్టం..

Gold Loans: ఇటీవల కాలంలో బంగారం రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. మొదటిది బంగారం ధరలు నిరంతరం పెరగడంతోపాటు గోల్డ్ లోన్స్ తీసుకోవడం చాలా సులభం. మరోవైపు దీనిపై వడ్డీ రేటు కూడా తక్కువగా ఉండటంతో అనేక మంది తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.


అనేక మంది ఆసక్తి

అంతేకాదు పలువురు తక్కువ వడ్డీకి డబ్బు తీసుకుని, పలువురికి ఎక్కువకు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొంత మంది మాత్రం వారి ఆర్థిక అవసరాల కోసం తీసుకుంటారు. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఇంట్లో ఉంచిన బంగారాన్ని ఉపయోగించి లోన్స్ తీసుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తారు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఈ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయని తెలుస్తోంది.

ఆర్‌బీఐ సన్నాహాలు

బంగారు రుణాలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భావిస్తోంది. కఠినమైన అండర్ రైటింగ్ విధానాలను అనుసరించాలని, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలని బంగారు రుణ రుణ సంస్థలను RBI ఆదేశించినట్లు తెలుస్తోంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCలు) బంగారు రుణ గ్రహీతలపై తనిఖీలను పెంచాలని ఆర్‌బీఐ చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో తాకట్టు పెట్టిన బంగారం యజమానులు వారేనా కాదా అనే ఖచ్చితమైన సమాచారాన్ని పొందాలని RBI ఆయా సంస్థలకు సూచించినట్లు తెలిసింది.


Read Also: Womens Day 2025: ఉమెన్స్ డే స్పెషల్.. మహిళల భద్రత కోసం టాప్ 5 యాప్స్

కారణమిదేనా..

సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటివరకు బ్యాంకుల బంగారు రుణ రేటు 50 శాతానికి పెరగడం విశేషం. దీంతో బంగారు రుణ రంగంలో వృద్ధి హద్దులు దాటకుండా, సంస్థలు ఒక ప్రామాణిక ప్రోటోకాల్‌ను అనుసరించాలని RBI భావిస్తోంది. ఆర్‌బీఐ అనైతిక వ్యాపార పద్ధతులను అరికట్టడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బంగారు రుణ నిబంధనలను మరింత కఠినతరం చేయవచ్చని ఆయా వర్గాలు అంటున్నాయి.

గతంలో చాలా లోపాలు

గత ఏడాది సెప్టెంబర్‌లో బంగారు రుణాలలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆర్‌బీఐ గుర్తించింది. రుణ సోర్సింగ్, బంగారం విలువను అంచనా వేయడంలో లోపాలను పసిగట్టింది. ఆ క్రమంలో నియంత్రణ లోపాలను గుర్తించి పరిష్కరించడానికి వారి రుణ ప్రక్రియలను సమగ్రంగా సమీక్షించాలని రుణదాతలను కోరింది. అన్ని సంస్థలు ప్రామాణిక నిబంధనలను పాటించడం లేదని ప్రస్తావించింది. గత 12 నుంచి 16 నెలలుగా నిర్వహించిన ఆడిట్‌లలో సెంట్రల్ బ్యాంక్ NBFC రుణదాతల పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు, బంగారం తాకట్టు పెట్టిన రుణ మొత్తాలను పర్యవేక్షించడంలో అనేక లోపాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

ఆర్‌బీఐ ఆందోళన

పలు సందర్భాలలో రుణం తిరిగి చెల్లించని రుణగ్రహీతలకు తెలియజేయకుండానే పలు సంస్థలు బంగారాన్ని వేలం వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బంగారం వేలం, రసీదుల ద్వారా అప్పుగా ఇచ్చిన డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం సహా, ఏ సంస్థ కూడా నిబంధనలను అతిక్రమించకుండా చూసుకోవడానికి బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రుణదాతలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఫిన్‌టెక్ ఏజెంట్లు బంగారాన్ని సేకరించడం, తనిఖీ చేయడం, నిల్వ చేయడం, తూకం వేసే క్రమంలో సరైన నిబంధనలు పాటించే అవకాశం ఉంది.

Related News

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Jiomart Offers: నవంబర్‌లో ఆఫర్ల వర్షం.. జియోమార్ట్‌లో సూపర్ డీల్స్ వచ్చేశాయ్..

Big Stories

×