E-Paper
Advertisement

Jio, Airtel Lost Users: జియో, ఎయిర్ టెల్‌కు షాకిస్తున్న బీఎస్ఎన్ఎల్

Jio, Airtel Lost Users: జియో, ఎయిర్ టెల్‌కు షాకిస్తున్న బీఎస్ఎన్ఎల్

Jio, Airtel Lost Users: బీఎస్ఎన్ఎల్‌‌కు పూర్వ వైభవం వస్తుందా? బీఎస్ఎన్ఎల్‌ ధాటికి జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు గింజుకుంటున్నాయా? బీఎస్ఎన్ఎల్‌ను ఆదరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందా? గడిచిన రెండునెలల్లో కస్టమర్లు పెరిగారా? జియో, ఎయిర్ టెల్‌ కంపెనీలకు వినియోగదారులు దూరం అవుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

మార్కెట్‌లో టెలికాం టారిఫ్ వార్ తీవ్రమవుతోంది. ఒకప్పుడు ప్రైవేటు కంపెనీల మధ్య ధరల యుద్ధం జరిగింది. టెలికాం సేవల రంగంలోకి జియో దిగడంతో పలు కంపెనీలు మర్జ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తమకు ఎదురులేదని భావించాయి జియో, ఎయిర్‌టెల్ కంపెనీ. మార్కెట్‌లో వీరిదే అగ్ర భాగం. పరిస్థితి గమనించిన బీఎస్ఎన్ఎల్ రంగంలోకి దిగేసింది.

జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇస్తోంది. బీఎస్ఎన్ఎల్‌‌ దెబ్బకు వినియోగదారులు ఆ కంపెనీలకు దూరమవుతున్నారు. లేటెస్ట్‌గా రెండు నెలల వ్యవధిలో 6.5 మిలియన్ల కొత్త వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్లిపోయారు. అటు జియో, ఎయిర్‌టెల్ దూరమవుతున్నారు వినియోగదారులు.

ఇటీవల కాలంలో జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు వినియోగదారులపై ఎడాపెడా ఛార్జీలు మోపడం మొదలుపెట్టాయి. వినియోగదారుల నుంచి అవుట్‌పుట్ తీసుకున్న బీఎస్ఎన్ఎల్,  నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరచడం, తక్కువ ధరలకు ప్లాన్‌లను ప్రవేశపెట్టడం, కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి వ్యూహాత్మక ఎత్తుగడలు వేసింది.. సక్సెస్ అయ్యింది.

ALSO READ: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..

ప్రైవేటు టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్ నుంచి  యూజర్స్ డ్రాపవ్వడం మొదలైంది. వినియోగదారులు తగ్గిపోవడంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయి ఆయా కంపెనీలు. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచబోమని ప్రకటించింది బీఎస్ఎన్ఎల్‌‌ (BSNL). బీఎస్ఎన్ఎల్‌‌ స్టేట్మెంట్‌పై ప్రైవేటు టెలికాం కంపెనీలు కాసింత గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో కంటే ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ సాధారణమైంది. ఫోన్ కాల్స్‌తోపాటు డేటాను కూడా ఉపయోగిస్తున్నారు. దీన్ని గమనించిన బీఎస్ఎన్ఎల్, ఇటువైపు దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలు ఉండడంతో అటు వైపు దృష్టి సారించడంతో వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారు.

ఈ లెక్కన బీఎస్ఎన్ఎల్‌కు పూర్వ వైభవం రావడం ఖాయమనే ప్రచారం టెలికాం సెక్టార్‌లో సాగుతోంది. అన్నట్లు 5జీ మొబైల్ సిమ్‌లను సైతం ప్రారంభించింది. మొత్తానికి ‘బీఎస్ఎన్ఎల్ అందరికీ కనెక్ట్’ అవుతుందన్నమాట.

 

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×