Best Mileage Cars : రోజులు గడిచేకొద్ది దేశీయ మార్కెట్లోకి కొత్తకొత్త కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో కార్ల వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నిర్వహణ వ్యయం తగ్గించకునేందుకు మైలేజ్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే మధ్య తరగతి కుటుంబాల అవసరాలకు అనుగుణంగా కార్లను తీసుకొస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు నాలుగు పెట్రోల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Alto K10
ఆల్టో కె10 కారును దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మారుతి చౌకైన కారుగా అందిస్తోంది. కంపెనీ ప్రకారం ఒక లీటర్ పెట్రోల్పై 24.90 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర కూడా రూ. 3.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Also Read : ఏప్రిల్ 29న XUV 3XO లాంచ్.. దీని స్పీడ్ అందుకోవడం కష్టమే!
Maruti Grand Vitara
మారుతి గ్రాండ్ విటారా అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో ఈ మారుతి ఎస్యూవీ ఉంటుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తున్న గ్రాండ్ విటారా కూడా ఒక లీటర్లో 27.97 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఈ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో హైబ్రిడ్ వేరియంట్ సగటున 27.97 kmpl ఇస్తుంది.
Toyota Urban Cruiser Hyryder
టయోటా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUVని గొప్ప ఫీచర్లతో అందిస్తోంది. కంపెనీ SUV పెట్రోల్ ఇంజన్,హైబ్రిడ్ టెక్నాలజీతో అద్భుతమైన మైలేజ్ కూడా అందిస్తుంది. ఈ SUV ఒక లీటర్ పెట్రోల్పై 27.97 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. దీని ధర రూ.11.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.66 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Also Read : మెర్సిడెస్ బెంజ్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. అదరగొడుతున్న లుక్!
Honda City Hybrid
జపనీస్ కార్ల తయారీదారు హోండా సిటీని సెడాన్ కారుగా అందిస్తోంది. కంపెనీకి చెందిన ఈ కారు కూడా హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించబడింది. దీని హైబ్రిడ్ వెర్షన్ ఒక లీటర్ పెట్రోల్పై 26.5 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. దీని ధర రూ. 20.55 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది.