E-Paper
Advertisement

DA Hike: హోలీ పండుగకు ముందే ఉద్యోగులకు శుభవార్త.. ఈసారి డీఏ ఎంత శాతమంటే..

DA Hike: హోలీ పండుగకు ముందే ఉద్యోగులకు శుభవార్త.. ఈసారి డీఏ ఎంత శాతమంటే..
Advertisement

DA Hike: హోలీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం త్వరలో డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు గురించి ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకు 2 నుంచి 3 శాతం డీఏ పెంపుదల ఉంటుందని తెలుస్తోంది. ఈ పెంపు నిర్ణయం తర్వాత దాదాపు 1.2 కోట్ల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు.

DA, DR ఏడాదికి రెండుసార్లు

ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యాన్ని మార్చుతుంది. జనవరి తరువాత జూలైలో మార్పు చేస్తారు. జనవరి సవరణను సాధారణంగా హోలీ సమయంలో ప్రకటిస్తారు. ఇక జూలై మార్పు గురించి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో దీపావళి పండుగ సమయంలో అనౌన్స్ చేస్తారు.

ఈసారి డీఏ ఎంత పెరిగే ఛాన్స్

Advertisement

డిసెంబర్ 2024 డేటా ప్రకారం ఈసారి DA 2 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో DA, DR 55 శాతానికి చేరుకుంటాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. మార్చి 7, 2024న కేబినెట్ డీఏను మునుపటి రేటు 46 శాతం నుంచి మూల వేతనంలో 50 శాతానికి పెంచింది ఈ ప్రకటన హోలీకి కొన్ని రోజుల ముందు మార్చి 25, 2024న వచ్చింది. దీని తరువాత అక్టోబర్ 16, 2024న 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DAలో 3 శాతం, పెన్షనర్లకు DRలో 7 శాతం పెంపుదలను కేబినెట్ ఆమోదించింది. ఈ పెరుగుదలతో DA, DR రెండూ 53 శాతానికి చేరుకున్నాయి.

Read Also: Investment Tips: ఈ ప్రభుత్వ స్కీంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బు 5 రెట్లు గ్యారంటీ..

తర్వాత ఏం జరగనుంది..

Advertisement

8వ వేతన సంఘం 2026లో అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో DAని తిరిగి చెల్లించి మూల వేతనంలో విలీనం చేస్తారా అని కూడా అనేక మంది ఆలోచిస్తున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తుది రూపం దాల్చుతాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మార్పుకు ముందు, 7వ వేతన సంఘం ప్రకారం మరో మూడు డీఏ పెంపుదల ప్రకటించే అవకాశం ఉంది.

పెన్షన్ కూడా..

ఈసారి హోలీ మార్చి 14న వస్తుంది. మార్చి 14 లోపు డీఏ పెంపుదల ప్రకటించడం ద్వారా మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ బహుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఇది మాత్రమే కాదు, డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు, డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. దీని అర్థం పెన్షనర్ల పెన్షన్ కూడా పెరగనుంది. దీంతో ఈసారి జనవరి 2025 నుంచి అమలు చేయబోయే డీఏ పెంపు ప్రకటన మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.

Read Also: Womens Day 2025: ఉమెన్స్ డే స్పెషల్.. మహిళల భద్రత కోసం టాప్ 5 యాప్స్

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×