BigTV English

DA Hike: హోలీ పండుగకు ముందే ఉద్యోగులకు శుభవార్త.. ఈసారి డీఏ ఎంత శాతమంటే..

DA Hike: హోలీ పండుగకు ముందే ఉద్యోగులకు శుభవార్త.. ఈసారి డీఏ ఎంత శాతమంటే..

DA Hike: హోలీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం త్వరలో డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు గురించి ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకు 2 నుంచి 3 శాతం డీఏ పెంపుదల ఉంటుందని తెలుస్తోంది. ఈ పెంపు నిర్ణయం తర్వాత దాదాపు 1.2 కోట్ల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు.


DA, DR ఏడాదికి రెండుసార్లు

ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు కరువు భత్యాన్ని మార్చుతుంది. జనవరి తరువాత జూలైలో మార్పు చేస్తారు. జనవరి సవరణను సాధారణంగా హోలీ సమయంలో ప్రకటిస్తారు. ఇక జూలై మార్పు గురించి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో దీపావళి పండుగ సమయంలో అనౌన్స్ చేస్తారు.

ఈసారి డీఏ ఎంత పెరిగే ఛాన్స్

డిసెంబర్ 2024 డేటా ప్రకారం ఈసారి DA 2 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో DA, DR 55 శాతానికి చేరుకుంటాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. మార్చి 7, 2024న కేబినెట్ డీఏను మునుపటి రేటు 46 శాతం నుంచి మూల వేతనంలో 50 శాతానికి పెంచింది ఈ ప్రకటన హోలీకి కొన్ని రోజుల ముందు మార్చి 25, 2024న వచ్చింది. దీని తరువాత అక్టోబర్ 16, 2024న 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DAలో 3 శాతం, పెన్షనర్లకు DRలో 7 శాతం పెంపుదలను కేబినెట్ ఆమోదించింది. ఈ పెరుగుదలతో DA, DR రెండూ 53 శాతానికి చేరుకున్నాయి.


Read Also: Investment Tips: ఈ ప్రభుత్వ స్కీంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బు 5 రెట్లు గ్యారంటీ..

తర్వాత ఏం జరగనుంది..

8వ వేతన సంఘం 2026లో అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో DAని తిరిగి చెల్లించి మూల వేతనంలో విలీనం చేస్తారా అని కూడా అనేక మంది ఆలోచిస్తున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తుది రూపం దాల్చుతాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మార్పుకు ముందు, 7వ వేతన సంఘం ప్రకారం మరో మూడు డీఏ పెంపుదల ప్రకటించే అవకాశం ఉంది.

పెన్షన్ కూడా..

ఈసారి హోలీ మార్చి 14న వస్తుంది. మార్చి 14 లోపు డీఏ పెంపుదల ప్రకటించడం ద్వారా మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ బహుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఇది మాత్రమే కాదు, డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు, డియర్‌నెస్ రిలీఫ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. దీని అర్థం పెన్షనర్ల పెన్షన్ కూడా పెరగనుంది. దీంతో ఈసారి జనవరి 2025 నుంచి అమలు చేయబోయే డీఏ పెంపు ప్రకటన మరికొన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.

Read Also: Womens Day 2025: ఉమెన్స్ డే స్పెషల్.. మహిళల భద్రత కోసం టాప్ 5 యాప్స్

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×