E-Paper
Advertisement

Financial Rules: మే 1 నుండి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే జేబుకు చిల్లు

Financial Rules: మే 1 నుండి  కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే జేబుకు చిల్లు

Financial Rules: మే నెల ప్రారంభం అయింది. పౌరులుగా మనం ప్రతి నెలా మారే కొన్ని నియమాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మే 1 నుండి మార్చబడుతున్న ఈ నియమాల గురించి మీకు తెలియకపోతే.. మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మే 1 నుండి మారబోయే కొత్త రూల్స్ మీ బ్యాంక్ ఖాతా, ATM లావాదేవీలు , LPG ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. మరి మే 1 నుండి మారబోయే నియమాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ATM రూల్స్:
మే 1 నుండి ATM ఉచిత పరిమితి ముగిసిన తర్వాత.. మీరు డబ్బును డ్రా చేసుకోవడానికి అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం.. మే 1 నుండి పరిమితికి మించి డబ్బులు డ్రా చేస్తే.. అదనంగా రూ.19 ఛార్జ్ చెల్లించాలి. గతంలో ఈ ఛార్జీ రూ.17 మాత్రమే.

మెట్రో నగరాల్లో నెలకు 3 సార్లు , ఇతర ప్రదేశాల్లో 5 సార్లు ఫ్రీగా డబ్బులు ఏటీఎం నుండి డ్రా చేసుకోవచ్చు. కానీ దీని పరిమితి మించిన తర్వాత.. మీరు ATM నుండి డబ్బు తీసుకున్న ప్రతిసారీ చార్జీలు కట్ అవుతాయి.

రైలు టిక్కెట్ల నిబంధనలు:
మే 1 నుండి రైల్వే నిబంధనలు కూడా మార్చారు. ఇప్పుడు మీరు వెయిటింగ్ టికెట్ తీసుకొని జనరల్ కోచ్‌లో మాత్రమే ప్రయాణించవచ్చు. ఈ టిక్కెట్లు స్లీపర్ , ఏసీ కోచ్‌లలో చెల్లవు. మీరు వెయిటింగ్ టికెట్‌పై ఈ కోచ్‌లలో ప్రయాణిస్తున్నట్లు దొరికితే.. TT మీకు జరిమానా విధిస్తారు.

FD వడ్డీ రేట్లలో తగ్గింపు:
RBI రెపో రేటును 0.25% తగ్గించింది. ఆ తర్వాత బ్యాంకులు FD పై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు మే 1 నుండి అధిక వడ్డీ రేటు FD లను (ఫిక్స్‌డ్ డిపాజిట్లు) నిలిపివేయాలని నిర్ణయించాయి.

పాల ధరలు పెరిగాయి:
మదర్ డెయిరీ , వెర్కా తర్వాత, అముల్ పాల ధరలు కూడా పెరిగాయి. మే 1, 2025 నుండి దేశవ్యాప్తంగా అముల్ పాల ధర లీటరుకు రూ.2 పెరిగింది. మదర్ డెయిరీ , వెర్కా బ్రాండ్లు కూడా పాల ధరను లీటరుకు రూ.2 పెంచాయి. ఇది పప్పు, పన్నీర్, నెయ్యి వంటి ఇతర ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది.

Also Read: భూలోక స్వర్గం పహల్గామ్.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

గ్యాస్ ధరలు:
ఎల్‌పిజి గ్యాస్ ధరలను గ్యాస్ సిలిండర్ కంపెనీలు ప్రతి నెలా సవరిస్తాయి. దీని కారణంగా.. మే 1న LPG గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు ఉంటాయి. ప్రస్తుతం సిలిండర్ ధర ₹ 17 తగ్గింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో ₹ 14.50 తగ్గి ₹ 1747 కు, కోల్‌కతాలో ₹ 17 తగ్గి ₹ 1851.50 కు చేరుకుంది. గతంలో ఇది ఢిల్లీలో ₹ 1762 కు , కోల్‌కతాలో ₹ 1868.50 కు లభించేది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ముంబైలో ₹ 14.50 తగ్గి ₹ 1699.00 కు, చెన్నైలో ₹ 1906.50 కు చేరుకుంది.

బ్యాంకులకు 12 సెలవు:
మే నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేయబడతాయి. ఆర్‌బిఐ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. రెండవ , నాల్గవ శనివారాలు, ఆదివారాలు కాకుండా, బుద్ధ పూర్ణిమ, మహారాణా ప్రతాప్ జయంతి నాడు కూడా బ్యాంకులకు సెలవు. ఇవి కాకుండా.. వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగ రోజులలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×