E-Paper
Advertisement

Gold Production: ఏపీలో బంగారం.. నవంబర్ నుంచి ఉత్పత్తి, ధరలు దిగొచ్చేనా?

Gold Production: ఏపీలో బంగారం.. నవంబర్ నుంచి ఉత్పత్తి, ధరలు దిగొచ్చేనా?
Advertisement

Gold Production: బంగారం కొండెక్కి కూర్చొంది. తులం మార్కెట్లో లక్షా 25 వేల పైమాటే. ఇప్పట్లో కిందకు దిగొచ్చే పరిస్థితులు లేవని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి ఏపీలో బంగారు ఉత్పత్తి మొదలుకానుంది. ఈ విషయాన్ని డెక్కన్ గోల్డ్ మైన్స్ స్వయంగా వెల్లడించింది. సింపుల్‌గా చెప్పాలంటే కొనుగోలుదారులకు ఇదొక శుభవార్త.

ఏపీలో బంగారం ఉత్పత్తి

Advertisement

మార్కెట్‌లో బంగారు ధరలు రోజురోజుకూ పెరిగిపోతోంది. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాలతో మదుపరులు గోల్డ్ పై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారంతోపాటు వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం మార్కెట్‌లో తులం బంగారు లక్షా 25 వేలు పైనే పలుకుతోంది. ఇంకా పెరుగుతోందని, దిగిరావడం కష్టమని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో డెక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ శుభవార్త చెప్పింది. నవంబర్ నుంచి కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో ఉత్పత్తి మొదలు పెడుతున్నట్లు ఆ కంపెనీ ప్రకటన చేసింది. తుగ్గలి మండలం బొల్లవానిపల్లి గ్రామం సమీపంలో నిర్మించిన పరిశ్రమ నుంచి శుద్ధి ప్రక్రియ మొదలవుతుందని అందులోని సారాంశం.

Advertisement

వచ్చేనెల నుంచి జొన్నగిరి బంగారం

దేశంలో ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫస్ట్ బంగారు గని ఇదే. పూర్తి స్థాయిలో పని చేస్తే ఏడాదికి 500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలన్నది ఆ కంపెనీ మాట. భవిష్యత్తులో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కొత్తగా నిర్మించిన ప్లాంట్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. స్థానిక యువత, భూములిచ్చిన రైతులకు అందులో ఉద్యోగాలు ఇస్తున్నట్లు పేర్కొంది.

ఏపీ గోల్డ్ మైన్స్ బంగారం అందుబాటులోకి వస్తే మార్కెట్లో ధరలు తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. మనకంటే ఎక్కువగా చైనా బంగారం దిగుమతి చేసుకుంటోంది. ఏపీలో  ఉత్పత్తి చేసిన బంగారాన్ని ఇక్కడి మార్కెట్ అవసరాలను తీర్చడం ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు.

ALSO READ: పసిడి కొనాలంటే వణికిపోతున్న ప్రజలు

ఏపీలో బంగారు ఉత్పత్తి అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయని సగటు మానవులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పెరిగిన ధర  నేపథ్యంలో బంగారం షాపుల వైపు చూడడం మానేశారు. ఒకప్పుడు శుభకార్యాలకు, పండుగలకు బంగారాన్ని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. మరి జొన్నగిరి బంగారం సామాన్యులకు అందుబాటులోకి వస్తుందా? లేక కొండెక్కి కూర్చుకుంటుందా? అనేది చూడాలి.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×