E-Paper
Advertisement

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. పసిడి ప్రియులకు షాక్

Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. పసిడి ప్రియులకు షాక్
Advertisement

Gold Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. తాజాగా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89,950 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,130 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు

Advertisement

అమెరికా డాలర్ విలువ బలహీనపడడంతో.. బంగారం ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచడం, డిమాండ్‌ను బలోపేతం చేస్తుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు పెరిగాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

నిపుణుల అంచనా ప్రకారం.. 2025 నాటికి బంగారం ధర ఔన్స్‌కు $3,500 దాటవచ్చు, దేశీయంగా తులం పసిడి ధర రూ.1 లక్ష మార్క్‌ను అధిగమించే అవకాశం ఉంది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గితే.. ధరల్లో స్వల్ప తగ్గుదలకు అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ ఒడిదొడుకులను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

Advertisement

బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,950 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 130 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,950 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,130 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 130 ఉంది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.90,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,280 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,950 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,130 వద్ద కొనసాగుతోంది.

ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98, 130 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

Also Read: మార్కెట్లోకి ఫేక్ బంగారం.. గుర్తించకపోతే బుక్కైపోతారు

వెండి ధరలు ఇలా..

వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,11,000 కి చేరుకుంది.

ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00, 000 వద్ద కొనసాగుతోంది.

 

Related News

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

Big Stories

Advertisement
×