E-Paper
Advertisement

Gold Rate Today: రూ.1 లక్ష మార్క్‌ని దాటిన పసిడి ధర.. ఒక్క రోజే రికార్డు స్థాయిలో

Gold Rate Today: రూ.1 లక్ష మార్క్‌ని దాటిన పసిడి ధర.. ఒక్క రోజే రికార్డు స్థాయిలో
Advertisement

Gold Rate Today: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులతో పశ్చిమాసియాలో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఈరోజు(జున్ 13th) బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,950 వద్ద కొనసాగుతోంది.

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధ పరిణామాలతో చమురు, బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా 12 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వెస్ట్‌ టెక్సాస్‌ బ్యారెల్ ధర 12.6 శాతం పెరగగా.. బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 12.2 శాతం ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారమే పసిడి పది గ్రాముల ధర లక్ష రూపాయలు దాటి నమోదైంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బంగారం రేటు మరింతగా పెరిగే అవకాశముంది.

Advertisement

ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై దెబ్బ భారీగా తగిలింది. మదుపరులకు బిగ్ షాక్ తగిలింది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. సూచీలు, షేర్ల ధరలు అనూహ్య రీతిలో కుప్పకూలాయి. సెన్సెక్స్ రోజు కనిష్ట స్థాయికి దిగజారి.. 700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 24,700 కంటే తక్కువ నమోదు అయింది. VIX 7% పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్మోజ్ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చనే ఆందోళనల మధ్య చమురు, బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,950 వద్ద ట్రేడ్ అవుతోంది.

విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,950 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 ఉంది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,550 వద్ద ట్రేడ్ అవుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,950 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 వద్ద కొనసాగుతోంది.

ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.

Also Read: వడ్డీ రేట్లు తగ్గడం.. టాటా మోటార్స్ ఊహించని ఆపర్లు, ఇంకెందుకు ఆలస్యం

వెండి ధరలు ఇలా..

బంగారం ధరలు మాదిరిగా.. వెండి ధరలు కూడా ఎన్నడూ లేని విధంగా.. రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,20,000 కి చేరుకుంది.

ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,10, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.

 

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×