E-Paper
Advertisement

Siddhartha Lal : మూలబడిన బుల్లెట్‌ను రోడ్డెక్కించాడు..!

Siddhartha Lal : మూలబడిన బుల్లెట్‌ను రోడ్డెక్కించాడు..!
Advertisement
 Royal Enfield CEO Siddhartha Lal

Siddhartha Lal : అది 2000వ సంవత్సరం. ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ నష్టాల్లో మునిగిపోనుందనీ, ఇక ఉత్పత్తిని ఆపేయాలని క్షేత్రస్థాయి కమిటీ ఓనర్ విక్రమ్ లాల్‌కు ఓ నివేదిక పంపింది. సరిగ్గా అప్పుడే ఆయన తనయుడు సిద్దార్థ్ రంగంలోకి దిగారు. కొద్దిగా సమయం ఇవ్వాలని తండ్రిని కోరి వాస్తవాలు తెలుసుకోవటం మొదలు పెట్టారు. కట్ చేస్తే.. 2022 డిసెంబర్ చివరి నాటికి దేశంలోనే దమ్మున్న బ్రాండ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ నిలిచింది. 22 ఏళ్ల ఈ ప్రయాణం సాగిన తీరు ఇదీ..

విజయ ప్రస్థానం
2000లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవోగా బాధ్యతలు, 2006 నాటికి ఐషర్ సీఈవో, ఎండీగా బాధ్యతలు తీసుకున్నారు. ఆఫీసులో కూర్చుంటే యూత్ నాడి పట్టలేమని, దేశమంతా తిరిగి బైక్‌ల విషయంలో యూత్ ఛాయిస్ తెలుసుకున్నారు. తిరిగి రాగానే బ్రాండింగ్‌ను పునరుద్ధరించటంతో బాటు బైక్ పనితీరును మెరుగుపరచటం మీద దృష్టి పెట్టారు. ‘లెస్ ఈజ్ మోర్’ అనే ఫిలాసఫీ ప్రకారం.. మీడియం ధరకు బైక్‌ను అందిస్తూ.. ప్రొడక్షన్ మాత్రం పెంచకుండా మార్కెట్‌లో బుల్లెట్‌కు డిమాండ్‌ను పెంచారు. బుల్లెట్ 350, క్లాసిక్ 350 మోడళ్ల సక్సెస్, ట్విన్ సిలిండర్ ఇంజన్‌కు రైడర్లు ఫిదా కావటంతో కంపెనీ విలువ పెరుగుతూ పోయింది.

Advertisement

2008లో ఐషర్‌లోని 46 శాతం వాటాను వోల్వోకు అమ్మి, తమ15 కుటుంబ వ్యాపారాల్లో 13ని అమ్మేసి, టైం అంతా ఎన్‌ఫీల్డ్‌కే కేటాయించారు. 2014 నాటికి ఐషర్ గ్రూపు ఆదాయంలో ఏకంగా 80శాతం వాటా రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచే రావటం మొదలైంది. 2015లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బాధ్యతలను వదిలి, ఐషర్ గ్రూప్ ఎండీ, సీఈవోగా కొనసాగుతూ, లండన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు.

2022 డిసెంబరు త్రైమాసికానికి రూ. 714 కోట్ల లాభంతో బాటు 8,34,895 బైక్‌లను విక్రయించి సేల్స్ రికార్డులను తిరగరాసింది. 2022 ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. కుటుంబ సంపద రూ. 54 వేల కోట్లు కాగా ఇందులో సిద్ధార్థ్ వాటా రూ. 37 వేల కోట్లు. ఇక.. కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ.. రూ. 80 వేల కోట్లుగా తేలింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా ఉత్పత్తిని కొనసాగిస్తున్న ఏకైక బ్రాండ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ నిలవటం విశేషం.

Advertisement

బయోడేటా:
డూన్ స్కూల్‌లో పాఠశాల విద్య, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనామిక్స్ డిగ్రీ పొందారు. తర్వాత యూకేలోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత అక్కడి లీడ్స్ యూనివర్సిటీలో ఆటో ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్స్ చేశారు.

Related News

పుత్తడి ప్రియులకు షాక్.. అమాంతంగా పెరిగిన ధర, నేడు మార్కెట్లో ధరలు ఇవే

ఐఫోన్ 18 ప్రో తక్కువ ధరలో కావాలా? ఈ దేశాల్లో కొంటే ఇండియా కంటే చీప్

పిఎఫ్ సెటిల్మెంట్ ఆలస్యం చేస్తే వడ్డీ తప్పదా? EPFO కేసులో మండిపడిన కోర్టు

SBI తప్పిదం.. రోజుకు రూ.5 వేలు చెల్లించాలన్న కోర్టు, ఇలా మీకూ జరిగిందా?

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

ఫోన్, కారు కంటే ఇల్లు ముఖ్యం? ఆర్థికపరంగా భారతీయుల ఆలోచనల్లో మార్పు

నిర్మాణ ఖర్చుల కంటే వేగంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే

Big Stories

Advertisement
×