E-Paper
Advertisement

SBI Hikes MCLR Rate: వడ్డీరేట్లు 10 బేసిస్‌ పాయింట్లు పెంచిన ఎస్బీఐ.. అమల్లోకి సవరించిన రేట్లు..!

SBI Hikes MCLR Rate: వడ్డీరేట్లు 10 బేసిస్‌ పాయింట్లు పెంచిన ఎస్బీఐ.. అమల్లోకి సవరించిన రేట్లు..!

SBI Hikes Benchmark MCLR Rate: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఎట్టకేలకు మార్జినట్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటును 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ కీలక ప్రకటన చేసింది. ఈ సవరించిన రేట్లు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఎంసీఎల్ఆర్ రుణ వడ్డీరేట్లను ఎస్బీఐ తన అధికారికి వెబ్ సైట్ లో పేర్కొంది. ఇది ప్రధానంగా లోన్ తీసుకున్న వారిపై ప్రభావం చూపనుంది.

ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో వెహికల్, హోం లోన్స్ మరింత ప్రియమైపోయాయి. ఇప్పటికే ఆటో, హోం లోన్లపై వడ్డీరేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించిన ఈఎంఐలు పెరిగాయి. అయితే అంతకుముందు కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలపర్చేందుకు ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించింది. ఆర్బీఐ 2020లో వడ్డీరేట్లను తగ్గించడంతో ఎక్కువ మొత్తంలో రుణాలు పొందారు.

మరోవైపు ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న తరుణంలో ధరలను కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను ప్రతీ ఏడాది పెంచుకుంటూ పోయింది. దీంతో రెపోరేటు గరిష్టంగా 6.50శాతానికి చేరింది. గతేడాది ఫిబ్రవరిలో చివరిసారిగా పెంచింది. దీంతో బ్యాంకులు, ఇతరత్రా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచేశాయి. ఈ కారంణంగా వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయని రుణాలు తీసుకున్న వారిపై భారం పడుతోంది. అయితే ఎస్బీఐ రుణగ్రహీతలపై మరింత పెరిగింది. జూన్ నెలలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో కన్జ్యూమర్ లోన్లు ప్రియమైయాయి.

Also Read: జియో, ఎయిర్‌టెల్‌లను దెబ్బతీసేలా BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్.. వారెవ్వా అదిరిపోయింది..!

ఏడాదికి గానూ ఎంసీఎల్ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.85 శాతానికి పెరిగింది. ఆరు నెలల కాలవ్యవధికి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి పెంచింది. ఇక రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితికి వరుసగా.. 8.85 శాతం నుంచి 8.95 శాతం, 8.95 శాతం నుంచి 9 శాతానికి ఎస్బీఐ పెంచింది.

అసలు ఎంసీఎల్ ఆర్ అంటే ప్రామాణిక రుణ రేటు. నిధుల సేకరణకు బ్యాంకులకు అయ్యే వ్యయం నిర్వహణ వ్యయం, సీఆర్ఆర్, కాలపరిమితి, ప్రీమియంలను పరిగణలోకి తీసుకొని ఎంసీఎల్ఆర్‌ను లెక్కిస్తారు. కాగా, బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువకు రుణాలు అందించే అవకాశం ఉండదు. అయితే ప్రస్తుతం ఎస్బీఐ ఈబీఎల్ఆర్ స్థిరంగా ఉంది. దీంట్లో ఎలాంటి సవరణలు చేయలేదు. ప్రస్తుం ఎస్బీఐ హోంలోన్ వడ్డీ రేటు 8.50 నుంచి 9.65 శాతం మధ్య కొనసాగుతోంది. ఇక, సిబిల్ స్కోర్ సహా ఇతర అర్హతలను ఆధారంగా మారుతుంది.

Tags

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×