E-Paper
Advertisement

Jeep Wrangler Launch in India: పోరగాండ్ల మతిపోగొడుతున్న జీప్ రాంగ్లర్.. ఈ రోజే లాంచ్..!

Jeep Wrangler Launch in India: పోరగాండ్ల మతిపోగొడుతున్న జీప్ రాంగ్లర్.. ఈ రోజే లాంచ్..!
Advertisement

Jeep Wrangler Launched in India on 22nd April: అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్‌కు గ్లోబల్ మార్కెట్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంది. జీప్ ఇప్పటికే పవర్ ఫుల్ ఎస్‌యూవీలను భారత్‌‌లో విడుదల చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త ఎస్‌యూవీ వెహికల్ జీప్ రాంగ్లర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇది ఆఫ్ రోడింగ్ సెగ్మెంట్‌లో తీసుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ విడుదల చేయనుంది. ఏప్రిల్ 22న ఈ వెహికల్ భారత్ మార్కెట్‌లోకి రానుంది. ఈ జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేసిందో చూడండి.

రాంగ్లర్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ జీప్ ద్వారా రేపు దేశీయ రోడ్లపైకి రానుంది. జీప్ ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీగా అందిస్తోంది. రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ రెండింటిలోనూ కంపెనీ మార్పులు చేసింది. ఈ ఎస్‌యూవీలో కొత్త మెరుగైన 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. రాంగ్లర్‌లో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా ఉండొచ్చు. దీనితో పాటు గ్రిల్, అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్‌ను కూడా ఎక్ట్సీరియర్‌లో మార్చుకోవచ్చు. సేఫ్టీ పరంగా కూడా మరికొన్ని ఫీచర్లను అప్‌డేట్ చేసింది.

Advertisement

Also Read: అద్భుతం చేసిన హీరో 125R.. అదిరిపోతున్న రెస్పాన్స్‌

2024 జీప్ రాంగ్లర్ వెర్షన్‌లో కంపెనీ రెండు లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఇస్తుంది. దీని కారణంగా ఎస్‌‌‌యూవీ 266 bhp పవర్, 400 న్యూటన్ మీటర్ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనితో ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఇవ్వవచ్చు. ఎస్‌యూవీని ఫోర్ వీల్ డ్రైవ్‌తో తీసుకురావచ్చు. ఎస్‌యూవీలో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉండొచ్చు.

Advertisement

రాంగ్లర్ ఎస్‌యూవీని కంపెనీ రూబికాన్, అన్‌లిమిటెడ్ వేరియంట్‌లలో అందిస్తోంది. రెండు వేరియంట్‌లను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కూడా ఇవ్వవచ్చు. ప్రస్తుత వేరియంట్‌తో పోలిస్తే కొత్త వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2 నుంచి 4 లక్షలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×