E-Paper
Advertisement

Unique Railway Stations: ఇంజిన్ ఒక రాష్ట్రంలో.. బోగీలు మరో రాష్ట్రంలో.. భారత్ లో పేరులేని రైల్వే స్టేషన్ గురించి మీరెప్పుడైనా విన్నారా?

Unique Railway Stations: ఇంజిన్ ఒక రాష్ట్రంలో.. బోగీలు మరో రాష్ట్రంలో.. భారత్ లో పేరులేని రైల్వే స్టేషన్ గురించి మీరెప్పుడైనా విన్నారా?
Advertisement

Unique Railway Stations in India: ఇండియన్ రైల్వేస్ చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలో భారతీయ రైల్వే ఒకటి. దేశంలో అత్యధిక మందిని తమ గమ్యస్థానాలకు చేర్చడంలో రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఉల్లాసంగా జర్నీ చేసేందుకు చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు.   దేశ వ్యాప్తంగా సుమారు 7 వేలకంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.  వాటిలో కొన్ని రైల్వే స్టేషన్లు ప్రకృతి అందాలకు నెలవు కాగా, మరికొన్ని అత్యంత దూరపు సర్వీసులను నడిపే స్టేషన్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. భారత్ లో కొన్ని స్పెషల్ రైల్వే స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

భారత్ లో స్పెషల్ రైల్వే స్టేషన్లు

Advertisement

భవానీ మండి రైల్వే స్టేషన్:

భవానీ మండి రైల్వే స్టేషన్ ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. సగం భాగం రాజస్థాన్ లో మిగతా సగం భాగం మధ్య ప్రదేశ్ లో ఉంటుంది. రెండు వేర్వేరు రాష్ట్రాల మధ్య విభజన కారణంగా, భవానీ మండి స్టేషన్‌లో ఆగిన ప్రతి రైలుకు రాజస్థాన్‌లో ఇంజిన్, మధ్యప్రదేశ్‌ లో దాని కోచ్ లను కలిగి ఉంటుంది. భవానీ మండి రైల్వే స్టేషన్‌కి ఒక చివర రాజస్థాన్ బోర్డు ఏర్పాటు చేయగా, మరో చివర మధ్యప్రదేశ్ బోర్డు పెట్టారు అధికారులు.

Advertisement

జార్ఖండ్‌ లో పేరులేని రైల్వే స్టేషన్:

రాంచీ నుంచి టోరీకి వెళ్లే రైలు జార్ఖండ్ లో ఓ పేరులేని రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుంది. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఎలాంటి బోర్డులు కనిపించవు. 2011లో మొదటిసారిగా ఈ స్టేషన్ నుంచి రైళ్లు నడపడం ప్రారంభించినప్పుడు.. దీనికి  బార్కిచాంపి అనే పేరు పెట్టాలని రైల్వే అధికారులు భావించారు. స్థానికుల నిరసనల కారణంగా, ఈ స్టేషన్ కు ఇప్పటికీ పేరు పెట్టలేదు.

బెంగాల్ లో పేరులేని మరో రైల్వే స్టేషన్:

బెంగాల్ రాష్ట్రంలోనూ ఓ పేరులేని రైల్వే స్టేషన్ ఉంది. బర్ధమాన్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంకురా-మస్‌ గ్రామ్ రైల్వే లైన్‌ లో ఓ రైల్వే స్టేషన్ ను 2008లో నిర్మించారు. ఈ స్టేషన్‌ కు మొదట రాయ్‌ నగర్ అని పేరు పెట్టారు. అయితే, స్టేషన్ పేరు మార్చాలని స్థానికులు రైల్వే బోర్డుకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి, ఈ స్టేషన్ పేరు లేకుండా నడుస్తోంది.

నవపూర్ రైల్వే స్టేషన్:

భారత్ లోని అత్యంత ప్రత్యేకమైన రైల్వే స్టేషన్లలో నవపూర్ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ స్టేషన్‌ లో ఒక భాగం మహారాష్ట్రలో, మరొకటి గుజరాత్‌లో ఉంది. ఇక్కడ ప్లాట్‌ ఫారమ్ నుండి బెంచ్ వరకు ప్రతిదానిపై మహారాష్ట్ర, గుజరాత్ అని రాయబడి ఉంటుంది. స్టేషన్‌లో ప్రకటనలు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ భాషల్లో అనౌన్స్ మెంట్స్ చేస్తారు.

అట్టారి రైల్వే స్టేషన్:

భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలోని అట్టారి రైల్వే స్టేషన్ వెరీ వెరీ స్పెషల్. పంజాబ్ లోని అమృత్‌ సర్‌ లో ఉన్న ఈ స్టేషన్ లోకి అడుగు పెట్టాలంటే కచ్చితంగా వీసా, పాస్ పోర్టు ఉండాలి. గతంలో ఇక్కడి నుంచి భారత్ సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను కరాచీ వరకు నడిపించేది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా రైలును భారత్ సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఈ స్టేషన్‌లో 24 గంటలు భద్రతా బలగాల నిఘాలో ఉంటుంది.

Read Also: దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు ఇవే, ఏకబిగిన ఎన్ని వేల కిలో మీటర్లు ప్రయాణిస్తాయో తెలుసా?

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×