E-Paper
Advertisement

Zomato Pure Veg Fleet : ప్యూర్ వెజ్ ఫ్లీట్ పై విమర్శలు.. వెనక్కి తగ్గిన జొమాటో

Zomato Pure Veg Fleet : ప్యూర్ వెజ్ ఫ్లీట్ పై విమర్శలు.. వెనక్కి తగ్గిన జొమాటో
Advertisement

Zomato Pure Veg Food Delivery Issue : స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లు అందుబాటులోకి వచ్చాక.. ఆన్లైన్ లో ఏ రకమైన ఫుడ్ కావాలన్నా ఆర్డర్ చేస్తే.. అరగంటలో ఇంటి ముందుంటాయి. వెజ్, నాన్ వెజ్, ఇటాలియన్, థాయ్ ఇలా రకరకాల ఫుడ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అయితే.. తాజాగా జొమాటో వెజ్ ఫుడ్ ను సెపరేట్ గా డెలివరీ చేసేందుకు స్పెషల్ గా జొమాటో ప్యూట్ వెజ్ ఫ్లీట్ పేరుతో ప్రకటన చేసింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది.

Advertisement

ప్యూర్ వెజ్ ఫ్లీట్ ను ప్రారంభిస్తామని ప్రకటించిన కొద్దిసేపటికే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. డెలివరీ బాయ్స్.. గ్రీన్ యూనిఫాం, గ్రీన్ జొమాటో బ్యాగ్స్ తో డెలివరీ చేస్తారని ప్రకటించింది. కాసేపటికే.. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని, ఇకపై డెలివరీ బాయ్స్ అంతా రెడ్ కలర్ టీ షర్ట్స్ తోనే డెలివరీ చేస్తారని తెలిపింది. అయితే ప్యూజ్ వెజ్ ఫ్లీట్ సేవల్ని నిలిపివేయడం లేదని, వెజ్ ఆర్డర్ల కోసం వాళ్లు కూడా ఉంటారని సీఈఓ దీపీందర్ గోయల్ ప్రకటించారు. ఇందులో తమకు ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవన్నారు.

వెజ్ డెలివరీల కోసం ఎందుకు సెపరేట్ గా డెలివరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారో దీపీందర్ వివరించారు. డెలివరీ బాక్సుల్లో ఎంత జాగ్రత్తగా డెలివరీ చేసినా.. ఆహారపదార్థాలు బ్యాగ్ లోపల ఒలుకుతాయని, వెజ్ ఆర్డర్ చేసినపుడు ఆ వాసన వాటికి కూడా అంటుకుంటుందని అందుకే వెజ్ ఆర్డర్లకోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో యూనిఫాం ను మాత్రమే మార్చడం లేదని, వెజ్, నాన్ వెజ్ ఆహారాలను వేర్వేరుగానే డెలివరీ చేస్తారని తెలిపారు.

Tags

Related News

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

Big Stories

Advertisement
×