Road Accident: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. ఐలాపురం గ్రామ శివారులో కారు అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి సమీపంలోని స్థానికులు వెంటనే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Also Read: తెలంగాణలో కుండపోత వర్షం.. ఆ జిల్లాల ప్రజలు బయటకు రావొద్దు
అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీకొన్న కారు
అయితే ఐలాపురం గ్రామానికి చెందిన నరేష్ తన కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధిక వేగం, రోడ్డు పరిస్థితులు లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వంటివి ఈ ప్రమాదానికి కారణాలు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామ శివారులో చెట్టును ఢీకొట్టిన కారు
తీర్థ యాత్రలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
నరేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి, మరో ఆరుగురికి గాయాలు
జగిత్యాల ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు pic.twitter.com/HIig55dSN6
— BIG TV Breaking News (@bigtvtelugu) August 5, 2025