Adulterated Pickles: స్వేచ్ఛ బ్యూరో: కుళ్లిపోయిన కూరగాయలు.. నాణ్యత లేని వంట దినుసులతో పచ్చళ్లుత తయారు చేస్తున్న అన్నదమ్ములను కుల్సుంపురా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి భారీ మొత్తంలో ఈ కల్తీ పచ్చళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఐ నరసింహ బుధవారం సిబ్బందితో కలిసి గస్తీ చేస్తూ వెంకటేశ్వర కాలనీలోని ఓ గోడౌన్ లో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారు. లోపలికి వెళ్లి తనిఖీ చేయగా జియాగూడకు చెందిన నరసింహ (54), నరేశ్ (45) కలిసి అక్కడ కుళ్లిపోయిన కూరగాయలు, నాసిరకం వంట దినుసులతో పచ్చళ్లు తయారు చేస్తున్నట్టు వెల్లడైంది.
Also Read: Inter Students in AP: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభం
దాంతోపాటు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో ఈ పని చేస్తున్నట్టు తేలింది. వీటిని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కిరాణా దుకాణాలకు సప్లయ్ చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు గోడౌన్ నుంచి 72 డ్రమ్ముల నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, గోంగూర పచ్చళ్లను సీజ్ చేశారు. దాంతోపాటు 6 డ్రమ్ముల టొమాటో, చింతపండు పేస్ట్, ఓ డ్రమ్ము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Action Thriller OTT: రెండు కుటుంబాల మధ్య దద్దరిల్లే గ్యాంగ్ వార్… ఓటీటీలో టాప్ రేటింగ్ తో ట్రెండింగ్