E-Paper
Advertisement

ఘాట్ రోడ్డులో ఘోరం.. కొండను ఢీకొన్న వ్యాన్, ఎగిరిపడ్డ ప్రయాణికులు!

ఘాట్ రోడ్డులో ఘోరం.. కొండను ఢీకొన్న వ్యాన్, ఎగిరిపడ్డ ప్రయాణికులు!
Advertisement

Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి జాతర ముగించుకుని సుమారు 40 మంది ప్రయాణికులతో తిరిగి వెళ్తున్న ఓ ఐచర్ వ్యాన్, బొంతువలస ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా అదుపు తప్పి ఒక్కసారిగా కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జవడమే కాకుండా, లోపల ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు.

ఈ ఘటనలో 10 మందికి పైగా తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: హోండా లవర్స్ కు క్రేజీ న్యూస్, CBR150R నయా బ్లాక్ ఎడిషన్ విడుదల!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×