Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి జాతర ముగించుకుని సుమారు 40 మంది ప్రయాణికులతో తిరిగి వెళ్తున్న ఓ ఐచర్ వ్యాన్, బొంతువలస ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా అదుపు తప్పి ఒక్కసారిగా కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జవడమే కాకుండా, లోపల ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు.
ఈ ఘటనలో 10 మందికి పైగా తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: హోండా లవర్స్ కు క్రేజీ న్యూస్, CBR150R నయా బ్లాక్ ఎడిషన్ విడుదల!
అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
బొంతువలస ఘాట్ రోడ్డులో కొండను ఢీకొట్టిన ఐచర్ వ్యాన్
చింతపల్లి జాతర నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం
వ్యాన్లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం
10 మందికి పైగా తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన… pic.twitter.com/hGOVqEIqjk
— BIG TV Breaking News (@bigtvtelugu) April 18, 2026