Andaman Sea: అండమాన్ సముద్రంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం, సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవాలనే ఆశతో పడవలో ప్రయాణమైన సుమారు 250 మంది ప్రాణాలు ఇప్పుడు గాలిలో దీపాల్లా మారాయి. దక్షిణ బంగ్లాదేశ్లోని టేక్నాఫ్ ప్రాంతం నుండి బయలుదేరిన ఈ పడవ, మలేసియా చేరుకోవాలనే లక్ష్యంతో సముద్రంలో ప్రయాణిస్తుండగా ప్రకృతి ప్రకోపానికి గురైంది.
ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా గాలుల వేగం పెరగడం, సముద్రపు కెరటాలు ఉద్ధృతంగా ఎగసిపడటంతో పడవ నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. పడవలో ఉన్నవారిలో ఎక్కువ మంది రోహింగ్యా శరణార్థులు , బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ, సముద్రపు స్థితిగతులు రక్షణ బృందాలకు సవాలుగా మారాయి. తీరని వేదన మిగిల్చిన ఈ ఘటన, ప్రాణాలను పణంగా పెట్టి సాగించే ప్రమాదకర వలసల వెనుక ఉన్న సామాజిక బాధలను మరోసారి కళ్లకు కట్టింది.
Also Read: ఒక్క ఫోన్ సిగ్నల్.. 200 మంది ప్రాణాలు.. విమానంలో ఫ్లైట్ మోడ్ ఎందుకు కంపల్సరీ?
అండమాన్ సముద్రంలో పడవ బోల్తా..250 మంది గల్లంతు
దక్షిణ బంగ్లాదేశ్ లో టేక్నాఫ్ ప్రాంతం నుంచి బయల్దేరిన బోట్
మలేసియా వెళ్తుండగా భారీ ఈదురుగాలులు, కెరటాల ఉద్ధృతికి పడవ బోల్తా
పడవలో రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులు
Boat Capsizes in Andaman Sea; 250 Missing
The boat… pic.twitter.com/wh1rHMN0X0— BIG TV Breaking News (@bigtvtelugu) April 15, 2026