E-Paper
Advertisement

Dog Bite: కుక్క కాటుకు గురై 15 నెలల తర్వాత బాలుడు మృతి

Dog Bite: కుక్క కాటుకు గురై 15 నెలల తర్వాత బాలుడు మృతి

Dog Bite: కుక్క కాటుకు గురైన బాలుడు 15 నెలలపాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస వదిలాడు. కొడుకును కాపాడుకోవటానికి తల్లిదండ్రులు 50 లక్షలకు పైగా ఖర్చు చేసినా ప్రాణాన్ని దక్కించుకోలేక పోయారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషాదం వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామ వాస్తవ్యులు మాధవి, శ్రీనివాస్​ భార్యాభర్తలు. వీరి కుమారుడు మణితేజ (9). 2004, డిసెంబర్​ 26న మణితేజ ఇంటి ముందు ఆడుకుంటుండగా దాడి చేసిన వీధి కుక్కలు విచక్షణారహితంగా కరిచాయి.

Also Read: Sridhar Babu: నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు: మంత్రి శ్రీధర్ బాబు

మెదడుకు వెళ్లే నరం..

వెంటనే మణితేజను హాస్పిటల్​ కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు టీకా వేయించారు. ఇంటికి వచ్చిన తరువాత జ్వరం రావటంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్ లో చేర్పించారు. ఇక్కడ జరిపిన పరీక్షల్లో కుక్క కాటు కారణంగా వెన్నెముక నుంచి మెదడుకు వెళ్లే నరం దెబ్బ తిన్నదని నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి వెంటిలేటర్​ పైనే ఉంచి మణితేజకు చికిత్స చేస్తూ వస్తున్నారు. అయినా, ఈ ప్రయత్నాలు ఫలించ లేదు. మంగళవారం మణితేజ చికిత్స పొందుతూ కన్నుమూయటంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.

Also Read: CM Revanth Reddy: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్.. కాసేపట్లో రాహుల్‌గాంధీతో భేటీ, పార్టీ ముఖ్యనేతలతో..

Related News

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

Big Stories

×