E-Paper
Advertisement

Chittoor Bus Accident: టిప్పర్ ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం!

Chittoor Bus Accident: టిప్పర్ ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం!
Advertisement

Gangasaram Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాం జరిగింది. చిత్తూరు శివారు ప్రాంతం గంగసాగరం సమీపంలో ఆగివున్న టిప్పర్ ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. 40 మందికి పైగా  తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

Advertisement

రంగనాథన్ ఇన్ ట్రావెల్స్ బస్సు  బస్సు తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ అయ్యింది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ గాజులపల్లి ఫ్లై ఓవర్ దగ్గర  ఆగి ఉంది. అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. ఎదురుగా ఉన్న టిప్పర్‌ ను తప్పించాలని డ్రైవర్  ప్రయత్నించాడు.  అయినప్పటికీ సాధ్యం కాకపోవడంతో టిప్పర్ ను ఢీకొని డివైడర్‌ కు తగిలించాడు. బస్సు వేగంగా ఉండటంతో బస్సు 20 అడుగులు ఎగిరిపడింది. రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోని కరెంట్ పోల్‌ ను బస్సు ఢీకొట్టింది. బస్సు వేగం ధాటికి కరెంటు పోల్ బస్సులోకి చొచ్చుకుపోయింది.

నలుగురు స్పాట్ డెడ్.. పలువురికి తీవ్ర గాయాలు

Advertisement

ఈ ప్రమాదంలో బస్సులో వెళ్తున్న నలుగురు ప్రయాణీకులు స్పాట్ లోనే చనిపోయారు. మరో 40 మంది గాయాపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి సీరియస్ గా ఉంటుంది.  ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. బాధితులను అంబులెన్స్ లలో వడంతో.. నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని  చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీరియస్ గా ఉన్న ఆరుగురిని  చీలాపల్లి సిఏంసి ఆసుపత్రి కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also: చంపి.. పూడ్చేసి.. అక్కడే పిండి వంటలు, వామ్మో ఇంత కిరాతకులు ఏంట్రా బాబూ!

క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్

ప్రమాద విషయం తెలుసుకున్నన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి.. బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు.

Read Also: పండుగపూట విషాదం, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎంత మంది చనిపోయారంటే..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×