E-Paper
Advertisement

Hyd News : అమెరికాలో రోడ్డు ప్రమాదం – తెలుగు యువకుడి దుర్మరణం

Hyd News : అమెరికాలో రోడ్డు ప్రమాదం – తెలుగు యువకుడి దుర్మరణం

Hyd News : అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత అధికారులు యువకుడి కుటుంబానికి తెలిపారు. ఖైరతాబాద్‌ ఎం.ఎస్‌ మక్తాకు చెందిన మహమ్మద్‌ వాజిద్‌ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు.. చదువులతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవాడు. అలాంటి వాడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో హైదరాబాద్ లోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగులు చేసుకుంటూ విద్యాభ్యాసం చేస్తున్న వాజిద్.. నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇండియాలు ఉన్నప్పుడు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన వాజిద్.. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఖైరతాబాద్‌ డివిజన్‌ యువజన నాయకుడిగా పని చేశాడు. ప్రస్తుతం సైతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న వాజిద్.. ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్‌ మైనారిటీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఓ వైపు చదువులు, మరోవైపు కుటుంబం కోసం కష్టపడుతున్న ఈ యువకుడు.. రాజకీయాల ద్వారా సమాజానికి ఉపయోగపడాలనే కోరికతో ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఇన్నాళ్లు తమకు అన్ని విధాలుగా అండదండగా ఉన్న వ్యక్తి దూరమయ్యే వరకు తీవ్రంగా దుఃఖిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం చికాగోలో ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

యువకుడి మృతి వార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. సికింద్రాబాద్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ సహా ఇతర నాయకులు యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అతని కుటుంబానికి తోడుగా ఉంటామని, క్రీయాశీల యువ నాయకుడు ఇలాంటి ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విచారకరం అంటున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×