Mahabubnagar Incident: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న యశోద (36) అనే మహిళ తన మూడేళ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం, ఆమె ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. దీని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రేబిస్ సోకిందనే అనుమానంతో ఆత్మహత్య
పోలీసుల వివరాల ప్రకారం, నరేష్, యశోద దంపతులకు అనురాగ్, అక్షర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. యశోద గత నెల రోజుల క్రితం తన ఇంటి ముందు ఆరబోసిన పల్లీలను ఒక వీధి కుక్క తినడం చూసింది. ఆ కుక్కను అదిలించి, ఆ పల్లీలను కడిగి తిన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వల్ల ఆమెకు రేబిస్ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు. రేబిస్ వ్యాధి కారణంగా ఆమె మతిస్థిమితం కోల్పోయి, ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ వ్యాధి మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, ఇది ఆమె చర్యలకు కారణం కావచ్చని పోలీసులు చెప్పారు.
ఆరోగ్యం కుదిట పడకపోవంతో నిరాశకు గురైన యశోద
సోమవారం యశోద భర్త ఉద్యోగానికి వెళ్లిన అనంతరం.. తాను తన కొడుకును ఆసుపత్రిలో చూపించమని, అదే తన చివరి కోరిక అని బోర్డు మీద రాసి మరి చనిపోయింది.. అక్కడి స్థానికులు అనుమానంతో అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే.. తల్లీ, కూతుళ్లు చనిపోయినట్టుగా గుర్తించారు. అయితే తను తిన్న పల్లీలలో కుక్క లాలజలం పడటంతో తన కుటుంబానికి రేబిస్ సోకిందనే అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ భయం కారణంగానే మానసికంగా కుంగిపోయిన యశోద కన్న కూతురిని చంపి, తాను చనిపోయిందని మృతురాలు యశోద భర్త తెలిపారు.
తల్లీకూతుర్ల ప్రాణాలను బలిగొన్న అనుమానం..
అయితే రేబిస్ టీకాలతో పాటు వైద్యం చేయించామని, చర్మ వ్యాధుల కారణంగా తన భార్య మనోవేదనకు గురైందని తన భర్త తెలిపారు. యశోద తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏదీ ఏమైనప్పటికి ఇది చాలా విషాదకరమైన ఘటన అని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
రేబిస్ సోకిందనే అనుమానంతో వివాహిత ఆత్మహత్య.. అనుమానాస్పద స్థితిలో కూతురు మృతి!
మహబూబ్నగర్ పట్టణం కొత్తగంజ్ ప్రాంతంలో ఘటన
నరేష్, యశోద దంపతులకు అనురాగ్, అక్షర అనే ఇద్దరు పిల్లలు
ఇంటి బయట పల్లీలు, డ్రైఫ్రూట్స్ ఆరబెట్టినప్పుడు వీధి కుక్కలు ఎంగిలి చేశాయని, వాటిని వంటల్లో… pic.twitter.com/hJX7SqwP3M
— BIG TV Breaking News (@bigtvtelugu) August 26, 2025