Cyber Crime: విదేశీ ఉద్యోగం మోజులో సైబర్ క్రిమినల్స్ చేతుల్లో చిక్కుకున్న ఓ వ్యక్తి దాని నుంచి బయట పడే అవకాశం వచ్చినా డబ్బు కోసం క్రిమినల్ గా మారాడు. చివరకు పోలీసులకు పట్టుబడి కటాకటాల పాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన గాజర్ల అవినాష్ విదేశీ ఉద్యోగం మోజులో ఓ ఏజెంట్ ద్వారా కాంబోడియా దేశం వెళ్లాడు. డేటా ఎంట్రీ ఉద్యోగం అని చెప్పి ఓ సైబర్ క్రిమినల్స్ గ్యాంగ్ అతనితో డిజిటల్ అరెస్ట్ నేరాలు చేయించింది. ఆ కొన్నాళ్లకు స్వదేశానికి వచ్చిన అవినాష్ నేరాలు చెయ్యటాన్ని కొనసాగించాడు. కాంబోడియాలోని గ్యాంగ్ కు సహకరిస్తూ అవినాష్ వస్తున్నాడు.
Also Read: కదిలే ఏసీ కావాలా? మార్కెట్లో ది బెస్ట్ ఇవే.. ఫీచర్స్ చూస్తే కెవ్వు కేక!
ఈ క్రమంలో బాలానగర్ కు చెందిన ఓ వృద్ధున్ని డిజిటల్ అరెస్ట్ పేర బెదిరించి రూ.42 లక్షలు కొల్లగొట్టాడు. తన వాటా మినహాయించుకొని మిగతా డబ్బును మ్యూల్ అకౌంట్ల ద్వారా కాంబోడియాలోని క్రిమినల్ కు పంపించాడు. బాధుతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. అవినాష్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.12 లక్షల నగదు, మొబైల్ ఫోన్, పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు.