E-Paper
Advertisement

Panjagutta Murder : పంజాగుట్టలో వ్యాపారి కిడ్నాప్.. మూడు రోజుల తర్వాత శవమైన ఘటన..

Panjagutta Murder : పంజాగుట్టలో వ్యాపారి కిడ్నాప్.. మూడు రోజుల తర్వాత శవమైన ఘటన..

Panjagutta Murder : మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని పంజాగుట్టలో అపహరణకు గురైన ఓ వ్యాపారి శవమై తేలాడు. ఈ ఘటన పంజాగుట్టలో కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28వ తేదీన పంజాగుట్టకు చెందిన ఓ వ్యాపారి కిడ్నాప్ కు కనిపించకుండాపోయాడు. అప్పటి నుంచి అతని కుటుంబ సభ్యులు, పోలీసులు ప్రయత్నిస్తున్నా.. ఆచూకీ లభించలేదు. కాగా.. మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడు.

పంజాగుట్టకు చెందిన విష్ణురూపాని అనే వ్యాపారి కనిపించకుండాపోయినప్పడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అనేక మార్గాల్లో విష్ణురూపాని గురించి ఆరా తీస్తుండగా.. ఎస్‌ఆర్‌ నగర్‌లోని బుద్ధనగర్‌లోని ఓ గది నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదు అందింది. దీంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు తెరచి చూడగా ఓ వ్యక్తి చనిపోయి కనిపించాడు. కాగా అతను పంజాగుట్టలో అదృశ్యమైన విష్ణురూపానిగా పోలీసులు తేల్చారు.

మృతదేహం పడి ఉన్న గదికి బయటి నుంచి తాళం వేసి ఉంది. దీంతో.. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. హత్యకు దారి తీసిన కారణాల్ని పోలీసుల అన్వేషిస్తున్నారు. కారు ఫైనాన్స్ కి సంబంధించిన వ్యవహారమే హత్యకు కారణంగా అనుమానిస్తుండగా.. త్వరలోనే నిందితుల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించా

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×