Doctor Misconduct: స్వేచ్చ బ్యూరో: జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళతో వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో జ్వరంతో బాధపడుతున్న ఒక మహిళ చికిత్స కోసం విజయలక్ష్మి హాస్పిటల్లో డాక్టర్ కిరణ్ కుమార్ను సంప్రదించినట్లు సమాచారం. ఈ సందర్భంగా డాక్టర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఆరోపించింది.
Also Read: Jeevan Reddy: హస్తానికి హ్యాండిచ్చే ఆలోచనలో జీవన్ రెడ్డి.. లైట్ తీసుకోండన్న హైకమాండ్..!
అయితే ఆ సమయంలో భయంతో ఇంటికి వెళ్లిపోయిన ఆమె, మళ్లీ జ్వరం ఎక్కువ కావడంతో మధ్యాహ్నం సిరి హాస్పిటల్లో చేరింది. అక్కడ జరిగిన విషయాన్ని తన భర్తకు వివరించడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు తోర్రూర్ సీఐ, మహిళా ఎస్ఐ అంజమ్మ సిరి హాస్పిటల్కు చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా ఆస్పత్రి వద్దనే డాక్టర్ కిరణ్ కుమార్పై ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also read: Nepali Gangs: వారిని నమ్మారో మీ పని ఐపోయినట్టే.. తేల్చిచెప్పిన పోలీసులు