E-Paper
Advertisement

East Godavari Accident: విషాదం.. పది రోజుల్లో డాక్టర్ కావాల్సింది.. పది నిమిషాల్లో ప్రాణం పోయింది!

East Godavari Accident: విషాదం.. పది రోజుల్లో డాక్టర్ కావాల్సింది.. పది నిమిషాల్లో ప్రాణం పోయింది!

East Godavari Accident: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే చదువు పూర్తి చేసుకుని కెరీర్‌లో స్థిరపడాల్సిన తరుణంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.

ఈ ప్రమాదానికి గురైన వారు రాజమహేంద్రవరం సమీపంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో దంత వైద్య విద్య (BDS) పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. చాగల్లుకు చెందిన జొన్నకూటి లిఖిత (23), తునికి చెందిన వాత్సల్య సాయి, విశాఖకు చెందిన జాహ్నవి రాజేశ్వరి రాజానగరంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నారు. వీరి ఇంటర్న్‌షిప్ మరో పది రోజుల్లో ముగియాల్సి ఉండగా, ఈ లోపే మృత్యువు కబళించింది.

అయితే ఘటన జరిగిన సమయంలో విద్యార్థులంతా తమ స్నేహితుడు కిశోర్‌తో కలిసి రాజమహేంద్రవరం నుంచి కారులో హాస్టల్‌కు తిరిగి వెళ్తున్నారు. దివాన్‌చెరువు – రాజానగరం మధ్యలో ప్రయాణిస్తుండగా, వీరి కారు ముందు వెళ్తున్న ఒక గుర్తుతెలియని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఎక్కి నిలిచిపోయింది.

ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, ముందు సీట్లో కూర్చున్న లిఖిత కారు బానెట్ భాగం మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించారు. ఆమె మృతదేహాన్ని వెలికితీయడానికి స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కారు నడుపుతున్న కిశోర్‌తో పాటు మిగిలిన ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.

Also Read: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి!

మరో పది నిమిషాల్లో క్షేమంగా బసకు చేరుకుంటామన్న సమయంలో ఈ విపత్తు సంభవించడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×