E-Paper
Advertisement

మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం

మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి దందా కలకలం
Advertisement

Crime News: స్వేచ్ఛ బ్యూరో: ఉప్పల్‌లోని నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలపై పోలీసులు దాడులు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు పహారా ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మల్లాపూర్ ప్రాంతంలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధారావత్ సంతోష్, సందీప్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 1 కిలో 200 గ్రాముల ఎండు గంజాయి, ఒక హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ ప్రాంతం నుంచి గంజాయిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి, మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

Advertisement

Also Read: మీరు ఏం తింటున్నారన్నది కాదు.. ఎలా తింటున్నారన్నదే ముఖ్యం!

ఉద్యోగులే లక్ష్యంగా..

ముఖ్యంగా విద్యార్థులు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అమ్మకాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సమాచారంతో ముందుగానే రూట్ వాచ్ నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది నిందితులను పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేసి వివరాలు వెల్లడించారు.

Advertisement

Also Read: అగ్నిగుండంగా మారుతున్న తెలంగాణ.. రికార్డు స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×