Road accident: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట సమీపాన గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ఓ కారు, ముందు వెళ్తున్న కంటైనర్ను వేగంగా వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.
ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి
పల్నాడు-చిలకలూరిపేటలో ఘటన
కంటైనర్ను వెనుక నుంచి ఢీకొన్న కారు
ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి
మరో ఇద్దరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు pic.twitter.com/FZRVP6nfyc
— BIG TV Breaking News (@bigtvtelugu) December 4, 2025
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.