Chain Snatching: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని తిలక్నగర్ డౌన్ ఏరియాలో పట్టపగలే జరిగిన ఒక చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటి ముందు పనులు చేసుకుంటున్న ఓడ్నాల భూలక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఒక దుండగుడు ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి సమీపంలో ఉన్న చెట్టు నుండి ఒక మామిడికాయ కింద రాలింది. దానిని తీసుకునేందుకు భూలక్ష్మి ముందుకు వెళ్లారు.
ఆమె మామిడికాయను తీసుకుని వెనక్కి తిరిగి వస్తుండగా, బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసును రన్నింగ్లోనే లాక్కొని క్షణాల వ్యవధిలో అక్కడి నుంచి పరారయ్యాడు. ఊహించని ఈ ప్రమాదంతో కంగుతిన్న భూలక్ష్మి తేరుకుని దొంగను వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనిపై ఆమె వెంటనే గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడి సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. చైన్ స్నాచింగ్ దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా నిక్షిప్తం కావడంతో, ఆ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఫుటేజ్ లోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Also Read: హర్యానాలో ఘోరం.. 10 సెకన్లలో 30 రౌండ్ల కాల్పులు.. యువకుడి దారుణ హత్య!
మామిడికాయ కోసం వెళ్తే.. బంగారు గొలుసు చోరీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని తిలక్నగర్లో చైన్ స్నాచింగ్ ఘటన
ఇంటి సమీపంలో ఉన్న చెట్టు నుంచి రాలిన మామిడికాయ
దానిని తీసుకునేందుకు వెళ్లిన మహిళ
తీసుకొని తిరిగి వస్తుండగా, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారైన దొంగ… pic.twitter.com/ZelI4RoNLA
— BIG TV Breaking News (@bigtvtelugu) May 17, 2026